Homeఉద్యోగాలుEPFO new rules : EPFO ఉన్న ఉద్యోగులకు ఇది తప్పనిసరి.. లేకుంటే..

EPFO new rules : EPFO ఉన్న ఉద్యోగులకు ఇది తప్పనిసరి.. లేకుంటే..

EPFO new rules : ఉద్యోగులు తమ భవిష్యత్ కోసం దాచుకునే డబ్బు సదుపాయాన్ని ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) అంటారు. ఇప్పుడు ఈఫీఎఫ్ వో సభ్యులకు మరింత సులభమైన, సురక్షితమైన సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త యూనిఫైడ్ EPFO పోర్టల్‌లో పలు కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా UAN యాక్టివేషన్, ఆధార్ ధ్రువీకరణ, డెత్ క్లెయిమ్ వంటి సేవల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ విషయాలను ప్రతీ ఈపీఎఫ్ వో ఉద్యోగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వివరాల్లోకి వెళితె..

UAN యాక్టివేషన్ ఇక..
ఇప్పటి వరకు EPFO సభ్యులు తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) మర్చిపోయినా.. లేదా యాక్టివేట్ చేయాల్సి వచ్చినా నేరుగా EPFO పోర్టల్‌లోనే ఆ సౌకర్యం ఉండేది. ఇందులో తమ వివరాలు అందించి మాడిఫికేషన్ చేసుకునేవారు. అయితే ఇప్పుడు కొత్త మార్పులతో ఆ ఫీచర్‌ను పోర్టల్ నుంచి తొలగించారు. ఇకపై UAN యాక్టివేషన్ లేదా సంబంధిత సేవలను UMANG యాప్ ద్వారానే పొందాల్సి ఉంటుంది. దీంతో అన్ని ప్రభుత్వ సేవలను ఒకే వేదికపై అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆధార్ ఆధారిత అథెంటికేషన్ తప్పనిసరి..
కొత్త యూనిఫైడ్ పోర్టల్‌లో సభ్యుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. అందులో భాగంగా ఆధార్ బేస్డ్ అథెంటికేషన్‌ను తప్పనిసరి చేశారు. సభ్యుల వివరాలు, క్లెయిమ్‌లు, ఖాతా సంబంధిత సేవలు పొందేందుకు ఆధార్‌తో ధ్రువీకరణ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో నకిలీ క్లెయిమ్‌లు, మోసాలకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు.

డెత్ క్లెయిమ్ ఫెసిలిటీకి ప్రత్యేక సౌకర్యం..
EPFO సభ్యుడు మరణించిన సందర్భంలో కుటుంబ సభ్యులు లేదా నామినీలు నిధులను పొందేందుకు ఇప్పుడు కొత్త పోర్టల్‌లో ప్రత్యేకంగా డెత్ క్లెయిమ్ ఫెసిలిటీని అందుబాటులో ఉంచారు. దీంతో కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసి ప్రక్రియను పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుంది. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి క్లెయిమ్‌ను సులభంగా సమర్పించవచ్చు.

డిజిటల్ సేవలకు ప్రాధాన్యం
కొత్త పోర్టల్‌లో సభ్యులకు అవసరమైన అనేక సేవలను పూర్తిగా డిజిటల్ రూపంలో అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఖాతా వివరాల పరిశీలన, KYC అప్‌డేట్, నామినేషన్, క్లెయిమ్ దరఖాస్తులు, ట్రాకింగ్ వంటి సేవలను మరింత వేగంగా పూర్తి చేసేలా వ్యవస్థను రూపొందించారు. దీంతో సేవల కోసం కార్యాలయాలను ఆశ్రయించే అవసరం తగ్గనుంది.

సభ్యులకు కలిగే ప్రయోజనాలు
కొత్త మార్పులతో EPFO సేవలు మరింత పారదర్శకంగా, సురక్షితంగా మారనున్నాయి. ఆధార్ ఆధారిత ధ్రువీకరణ వల్ల ఖాతా భద్రత పెరుగుతుంది. UMANG యాప్ ద్వారా UAN సేవలు సులభంగా పొందవచ్చు. అలాగే డెత్ క్లెయిమ్ వంటి కీలక సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రావడంతో కుటుంబ సభ్యులకు సమయం, శ్రమ రెండూ ఆదా కానున్నాయి.

ఏం చేయాలి?
EPFO సభ్యులు తమ ఆధార్, మొబైల్ నంబర్, బ్యాంక్ వివరాలు, KYC సమాచారాన్ని తాజాగా ఉంచుకోవాలి. అలాగే UMANG యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని UAN సంబంధిత సేవలను వినియోగించుకోవడం మంచిది. కొత్త యూనిఫైడ్ EPFO పోర్టల్‌లోని మార్పులను తెలుసుకుని వాటికి అనుగుణంగా ఖాతాను నిర్వహిస్తే భవిష్యత్తులో సేవలు మరింత సులభంగా పొందే అవకాశం ఉంటుంది.

 

 

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version