HomeNewsPuri Jagannath Rath Yatra 2025: పూరి జగన్నాథ రథయాత్రకు వెళ్లారా? అయితే ఈ ప్రాంతాలను...

Puri Jagannath Rath Yatra 2025: పూరి జగన్నాథ రథయాత్రకు వెళ్లారా? అయితే ఈ ప్రాంతాలను అసలు మిస్ అవద్దు..

Puri Jagannath Rath Yatra 2025: ఒడిశాలోని పూరిలో జగన్నాథ రథయాత్ర ప్రారంభమైంది. ఇది హిందూ మతానికి చెందిన చాలా ముఖ్యమైన పండుగ. ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల పక్ష రెండవ రోజున జరుగుతుంది. ఈ యాత్ర పూరిలో జరిగినప్పటికీ, దీనిని ప్రతి ఒక్కరు జరుపుకుంటారు. వాస్తవానికి, అనారోగ్యం పాలైన తర్వాత, జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి తన అత్త ఇంటికి వెళ్తాడని, అక్కడ నుంచి స్వస్థత పొందిన తర్వాత తన ఆలయానికి తిరిగి వెళ్తాడని నమ్ముతారు.

ఈ యాత్రను ఎంతో ఆర్భాటంగా నిర్వహిస్తారు. దీనికి ప్రజల్లో ఎంత క్రేజ్ ఉందంటే, ప్రతి సంవత్సరం ప్రజలు దీనిలో పాల్గొనడానికి సుదూర ప్రాంతాల నుంచి పూరీకి వస్తారు. మీరు కూడా రథయాత్రలో పాల్గొనడానికి పూరీకి చేరుకుంటే , పూరిలో ఉన్న కొన్ని ప్రదేశాలను సందర్శించకుండా తిరిగి రాకండి. మరి అవేంటంటే?

గుండిచ ఆలయం
అనారోగ్యం పాలైన తర్వాత జగన్నాథుడు ఈ ఆలయాన్ని సందర్శిస్తాడు. దీనిని “జగన్నాథ తోట” అని పిలుస్తారు. ఇది ప్రధాన ఆలయం నుంచి 3 కి.మీ దూరంలో ఉంది. ఈ అత్యంత అందమైన ఆలయంలో, మీరు నగర సందడికి దూరంగా కొన్ని క్షణాలు ప్రశాంతంగా గడపగలుగుతారు.

పూరి బీచ్
బంగాళాఖాతం వెంట విస్తరించి ఉన్న ఈ బీచ్ దాని ప్రత్యేకమైన బంగారు ఇసుకకు ప్రసిద్ధి చెందింది. ఇసుక సూర్యకాంతిలో కరిగిన బంగారంలా మెరుస్తుంది. దీని దృశ్యం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మీరు ఇక్కడ పారాసెయిలింగ్ కూడా చేయవచ్చు. రోజువారీ హడావిడికి దూరంగా సరదాగా గొప్ప సమయాన్ని గడపవచ్చు.

స్వర్గద్వార్ బీచ్
స్వర్గ్ ద్వార్ బీచ్ పేరు సూచించినట్లుగా, ఈ బీచ్ “స్వర్గానికి ద్వారం”గా పరిగణిస్తారు. నిజానికి, ఈ బీచ్ చాలా మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇక్కడ స్నానం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్ముతారు. అందమైన సూర్యాస్తమయాన్ని చూస్తూ మీరు ఇక్కడ కొన్ని విశ్రాంతి క్షణాలను ఎంజాయ్ చేయవచ్చ.

రఘురాజ్‌పూర్ వారసత్వ గ్రామం
పూరీ నుంచి 12 కి.మీ దూరంలో ఉన్న ఈ గ్రామం పట్టచిత్ర చిత్రాలు, సాంప్రదాయ చేతిపనులకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రతి ఇంట్లో ఒక కళాకారుల వర్క్‌షాప్ ఉంటుంది. ఈ గ్రామం ఒడిశా గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

కోణార్క్ సూర్య దేవాలయం
కోణార్క్ సూర్య దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో చేర్చిన చాలా అందమైన ఆలయం. ఇది పూరీ నుంచి 35 కి.మీ దూరంలో ఉంది. 13వ శతాబ్దపు ఈ ఆలయం కళింగ నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణగా చెబుతుంటారు. ఇది సూర్య భగవానుడికి అంకితం చేసిన భారీ రథం ఆకారంలో ఉంటుంది.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version