Evaru Meelo Koteeswarulu: ఎన్టీఆర్ హోస్ట్గా ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమం తెలుగులో సక్సెస్ఫుల్గా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ షోకి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం హాజరవుతున్న విషయం తెలిసిందే. కర్టన్ రైజర్ ఎపిసోడ్కి రామ్ చరణ్ హాజరై తెగ సందడి చేయగా, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ రాజమౌళి-కొరటాల కూడా రంగంలోకి దిగారు.
ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదల కాగా, ఇందులో ఎన్టీఆర్ ..నేనే బాస్ ఇక్కడ, ‘లొకేషన్ నాది డైరెక్షన్ నాది అంటూ భయపెట్టించారు.అతి త్వరలోనే ఈ షో ప్రసారం కానుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ షోకి హాజరు కానున్నట్టు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇది నిజమేనని తాజా సమాచారం ప్రకారం అర్ధమైంది.
ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి మహేష్ గెస్ట్గా హాజరు కాగా, దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తైందట. అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ప్రత్యేక సెట్లో చిత్ర షూటింగ్ నిన్న కంప్లీట్ అయ్యిపోయిందట. అలాగే ఈ ఎపిసోడ్ కూడా చాలా ఎంటర్టైనింగ్ గా వచ్చినట్టు వినికిడి. అంతే కాకుండా ఈ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ని మేకర్స్ దసరా కానుకగా టెలికాస్ట్ చేసే అవకాశం ఉందని బజ్ వినిపిస్తుంది.
ఇంతలా బజ్ క్రియేట్ చేయడానికి గల కారణం..?
టీఆర్పీ రేటింగ్స్ పరంగా చూస్తే ఇంకా జెమిని టీవీ నాలగవ స్థానంలో కొనసాగుతోంది. “బిగ్ బాస్”పుణ్యమా అంటూ “స్టార్ మా” ఇప్పుడు అగ్ర స్థానంలో నిలిచింది. “సరిలేరు” నాకెవ్వరుఅంటు సీరియల్స్ తో దూసుకుపోతున్న “జీ తెలుగు” రెండవ స్థానంలో నిలిచింది. జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ, ఢీ షోస్ ద్వారా “ఈ టీవీ” మూడవ స్థానంలో నిలిచింది.
“మాస్టర్ చెఫ్”, “ఎవరు మీలో కోటీశ్వరుడు” షోస్ ద్వారా టీఆర్ పీ రేటింగ్ ని పెంచుకోవాలని తాపత్రయ పడుతుంది జెమిని టీవీ. ఎంత రేటింగ్స్ పెంచుకోవాలని చూసినా నాలగవ స్థానం లోనే ఉంటుంది జెమిని టీవీ. దసరా కానుకగా “మహేష్ బాబు” ని తీసుకొచ్చి రేటింగ్స్ పెంచుకోవాలని, స్థానం మెరుగు పరుచుకోవాలని సాయిశక్తులా ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగా జెమిని టీవీ ఎంతవరకు సఫలీకృతమవుతుందో చూడాలి.