Sai Dharam Tej: మెగా హీరో సుప్రీం సాయి ధరమ్ తేజ్కు ఇటీవలే హైదరాబాద్ దుర్గం చెరువు దగ్గర బైక్ యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడి.. దాదాపు కొన్ని నెలల తర్వాత మెల్లగా కోలుకున్నారు. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. కాగా, తాజాగా, ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే తేజ్కు పోలీసులు నోటీసులు పంపించారు. అయితే, ఈ నోటీసులపై ఇప్పటివరకు సాయి తేజ్ స్పందించలేదని.. త్వరలోనే అతనిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశాలున్నాయని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

ప్రమాదం జరిగినరోజే కేసు నమోదు చేశామని.. అందువల్ల అతని లైసెన్స్, బైక్ ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ డాక్యుమంట్లు ఇవ్వాలని కోరుతూ నోటీసులు పంపింంచగా.. తేజ్ ఏ నోటీసులకు స్పందించలేదని అన్నారు. అందుకే అతనిపై యాక్షన్ తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. మరి ఈ విషయంపై మెగా మేనల్లుడు ఎలా స్పందింస్తాడో తెలియాల్సి ఉంది.
Also Read: Kaliyugam Movie: ‘కలియుగం’ ఎలా ఉంటుందో చూపిస్తానంటున్న జెర్సీ హీరోయిన్
కాగా, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ హీరో.. జనవరి నుంచి సినిమా షూటింగ్ల్లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే డైరెక్టర్ మారుతితో కథ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవలే రిపబ్లిక్ సినిమాతో పలకరించిన ఈ యువహీరో.. చాలా కాలం తర్వాత మంచి హిట్ కొట్టాడు. అంతలోనే ఈ యాక్సిడెంట్ జరిగిపోయింది. మళ్లీ తన సినిమాలో కొత్తదనాన్ని చూపిస్తూ ముందుకు దూసుకెళ్తాడేమో చూడాలి.
Also Read: Saipallavi: సాయిపల్లవిపై శ్యామ్సింగరాయ్ నిర్మాత ప్రశంసల వర్షం