ఉత్తరప్రదేశ్లో అత్యాచారానికి గురైన బాలిక ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ఈనెల 14న ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో యువతి తన తల్లితో కలిసి పొలం పనులకు వెళ్లింది. పొలం పనులు చేసుకుంటుండగా నలుగురైదురు వ్యక్తులు తనపై దాడి చేసి లాక్కుపోయారు. ఆమె కోసం వెతకగా తీవ్ర గాయాలై ఉందని మృతురాలి సోదరుడు వెల్లడించారు. ఆ తరువాత అత్యాచారానికి గురైందని తెలుసుకున్న తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. చికిత్స కోసం ఢిల్లీ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించిందన్నారు. ఇదిలా ఉండగా ఆమెపై దారుణానికి ఒడిగట్టిన దుండగులు యువతి నాలుక కోశారు. మరోవైపు నిందితులను గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు.
Also Read: హైదరాబాద్ లో సెలబ్రిటీలకు షాక్.. వాట్సాప్ చాట్ హ్యాక్