రైతుల ఆందోళనలపై కేంద్ర మంత్రుల భేటీ

ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనపై కేంద్ర మంత్రి అమిత్ షా నివాసంలో కేంద్ర మంత్రులు బుధవారం మరోసారి సమావేశమయ్యారు. మంగళవారం రైతు యూనియన్ల నేతలతో సమావేశం అయినా ఎలాంటి నిర్ణయానికి రాకపోవడంతో బుధవారం మరోసారి సమావేశమైనట్లు తెలుస్తోంది. నేటి సమావేశంలో రైతు డిమాండ్లపై చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా రైతులు ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఢిల్లీ ఖాపీపూర్ సరిహద్దు వద్ద రైతులు పశువులను తెచ్చి నిరసన తెలిపారు. అలాగే సింఘు, తిక్రీల్లోనూ నిరసన కొనసాగుతోంది. కాగు […]

Written By: Suresh, Updated On : December 2, 2020 4:17 pm
Follow us on

ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనపై కేంద్ర మంత్రి అమిత్ షా నివాసంలో కేంద్ర మంత్రులు బుధవారం మరోసారి సమావేశమయ్యారు. మంగళవారం రైతు యూనియన్ల నేతలతో సమావేశం అయినా ఎలాంటి నిర్ణయానికి రాకపోవడంతో బుధవారం మరోసారి సమావేశమైనట్లు తెలుస్తోంది. నేటి సమావేశంలో రైతు డిమాండ్లపై చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా రైతులు ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఢిల్లీ ఖాపీపూర్ సరిహద్దు వద్ద రైతులు పశువులను తెచ్చి నిరసన తెలిపారు. అలాగే సింఘు, తిక్రీల్లోనూ నిరసన కొనసాగుతోంది. కాగు రైతు యూనియన్లతో ప్రభుత్వం గురువారం మరోసారి చర్చలు జరిపే అవకాశముంది.