ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి

ఓ బస్సును మరో వాహనం ఢీకొట్టడంతో ఏడుగరు మృతి చెందిన సంఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో శనివారం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని లఖ్‌నవ్‌ నుంచి పిలిభిత్‌ వెళుతున్న బస్సు పురన్‌పుర్‌ ప్రాంతంలోకి రాగానే ఎదురుగా వస్తున్న ఓ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 30 మంది గాయపడినట్లు స్థానిక పోలీసు అధికారి జయప్రకాశ్‌ తెలిపారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Written By: Suresh, Updated On : October 17, 2020 11:13 am
Follow us on

ఓ బస్సును మరో వాహనం ఢీకొట్టడంతో ఏడుగరు మృతి చెందిన సంఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో శనివారం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని లఖ్‌నవ్‌ నుంచి పిలిభిత్‌ వెళుతున్న బస్సు పురన్‌పుర్‌ ప్రాంతంలోకి రాగానే ఎదురుగా వస్తున్న ఓ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 30 మంది గాయపడినట్లు స్థానిక పోలీసు అధికారి జయప్రకాశ్‌ తెలిపారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.