ఓ బస్సును మరో వాహనం ఢీకొట్టడంతో ఏడుగరు మృతి చెందిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శనివారం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని లఖ్నవ్ నుంచి పిలిభిత్ వెళుతున్న బస్సు పురన్పుర్ ప్రాంతంలోకి రాగానే ఎదురుగా వస్తున్న ఓ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 30 మంది గాయపడినట్లు స్థానిక పోలీసు అధికారి జయప్రకాశ్ తెలిపారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.