
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మినీ బస్సు 50 అడుగుల వంతెన పై నుంచి కింద పడింది. ఈ ప్రమాందలో ఐదుగురు మృతి చెందారు. ఏడుగురికి తీవ్ర గాయాలైనట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ముంబై నుంచి గోవాకు వెళ్తున్న ఈ మినీ బస్సు సతారా జిల్లాలోని పూణె-బెంగుళూరు హైవేపై ఉన్న వంతెన పై నుంచి కిందపడింది. కాగా గాయపడ్డవారిని సమీప ఆసుపత్రికి తరలించారు.మృతుల్లో మహిళ, చిన్నారి కూడా ఉన్నారన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకున్నారు. అయితే గాయపడిన వారి పరిస్థతి నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు.