2014 తరువాత నుంచి దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. బీహార్లో జరిగే ఎన్నికల్లో భాగంగా శుక్రవారం ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్డీయే కూటమి తరుపున ప్రచారం చేస్తున్న ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన క్రమంలో నితీష్ కుమార్ ప్రభుత్వం శరవేగంగా స్పందించి ప్రజలకు అండగా నిలిచిందన్నారు. బీహార ప్రజలు కరోనాను జయించి పండుగ జరుపుకుంటున్నారన్నారు. అంతకుముందు రామ్విలాస్ పాశ్వాన్కు ఆయన ఘనంగా నివాళులర్పించారు.