భారత్‌లో అడుగుపెట్టిన పాంపియో

భారత్‌ అమెరికా మద్య 2+2 చర్చలు మంగళవారం జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్‌ పాంపియో, రక్షణ కార్యదర్శి మార్క్‌ ఎస్పెర్‌ సోమవారం న్యూఢిల్లీ చేరుకున్నారు. మైక్‌ పాంపియో వెంట ఆయన భార్య సుసాన్‌ కూడా ఉన్నారు. మంగళవారం వీరు కేంద్ర మంత్రి జై శంకర్‌, రాజ్‌నాథ్‌సింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. ప్రధాని మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌తోనూ వీరు సమావేశం అవుతారు. అమెరికా ఎన్నికలు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో […]

Written By: Suresh, Updated On : October 26, 2020 5:49 pm
Follow us on

భారత్‌ అమెరికా మద్య 2+2 చర్చలు మంగళవారం జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్‌ పాంపియో, రక్షణ కార్యదర్శి మార్క్‌ ఎస్పెర్‌ సోమవారం న్యూఢిల్లీ చేరుకున్నారు. మైక్‌ పాంపియో వెంట ఆయన భార్య సుసాన్‌ కూడా ఉన్నారు. మంగళవారం వీరు కేంద్ర మంత్రి జై శంకర్‌, రాజ్‌నాథ్‌సింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. ప్రధాని మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌తోనూ వీరు సమావేశం అవుతారు. అమెరికా ఎన్నికలు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో వీరి పర్యటన ప్రాధాన్యతనిస్తోంది.