రిపబ్లిక్ డే వేడుకలకు బ్రిటన్ ప్రధానమంత్రి

వచ్చే నెలలో నిర్వహించనున్న రిపబ్లిక్ వేడుకలకు బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ హాజరుకానున్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2021 రిపబ్లిక్ వేడుకలకు హాజరు కావాలని నవంబర్ 27వ తేదీన ఫోన్ లో ఆహ్వానించారు. దీంతో మోడీ ఆహ్వానాన్నిబోరిస్ అంగీకరించినట్లు బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఆయన భారత పర్యటనలో ఉన్నారు. దీంతో 27 ఏళ్ల తరువాత రిపబ్లిక్ వేడుకల్లో బ్రిటన్ ప్రధాని బోరిస్ పాల్గొనబోతున్నారు. గతంలో 1993లో జాన్ మేజర్ […]

Written By: Suresh, Updated On : December 15, 2020 3:49 pm
Follow us on

వచ్చే నెలలో నిర్వహించనున్న రిపబ్లిక్ వేడుకలకు బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ హాజరుకానున్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2021 రిపబ్లిక్ వేడుకలకు హాజరు కావాలని నవంబర్ 27వ తేదీన ఫోన్ లో ఆహ్వానించారు. దీంతో మోడీ ఆహ్వానాన్నిబోరిస్ అంగీకరించినట్లు బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఆయన భారత పర్యటనలో ఉన్నారు. దీంతో 27 ఏళ్ల తరువాత రిపబ్లిక్ వేడుకల్లో బ్రిటన్ ప్రధాని బోరిస్ పాల్గొనబోతున్నారు. గతంలో 1993లో జాన్ మేజర్ హాజరయ్యారు. మరోవైపు వచ్చే ఏడాది నిర్వహించే జీ 7 సదస్సుకు హాజరు కావాలని ప్రధాని మోడీని బోరిస్ కోరారు.