నౌషెరాలో కాల్పులు: జవాను మృతి

గత కొన్ని రోజులుగా జమ్మూ కాశ్మీర్ లో భారత ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. తాజాగా శనివారం జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్ లో పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో కార్ప్ కు చెందిన హవల్దార్ పాటిల్ సంగ్రామ్ శివాజీ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం అతనిని సమీప ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. నైషెరా సెక్టార్లోని లామ్ ప్రాంతంలో పాక్ సైనికులు కాల్పులు జరిపినట్లు భారత ఆర్మీ తెలిపింది. […]

Written By: Suresh, Updated On : November 21, 2020 1:01 pm
Follow us on

గత కొన్ని రోజులుగా జమ్మూ కాశ్మీర్ లో భారత ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. తాజాగా శనివారం జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్ లో పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో కార్ప్ కు చెందిన హవల్దార్ పాటిల్ సంగ్రామ్ శివాజీ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం అతనిని సమీప ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. నైషెరా సెక్టార్లోని లామ్ ప్రాంతంలో పాక్ సైనికులు కాల్పులు జరిపినట్లు భారత ఆర్మీ తెలిపింది. అయితే ఇటీవల భారత భద్రతాదళాలు నలుగులు ఉగ్రవాదులను మట్టుపెట్టిన విషయం తెలిసింది. ఆ తరువాత పాక్ ఇలా కాల్పులు జరపడం చర్చనీయాంశంగా మారింది.