
ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ భారత్లో లేదని కేంద్రం తాజాగా ప్రకటించింది. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..కొత్త స్ట్రెయిన్ వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ..వ్యాధి తీవ్రతలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేసింది. మంగళవారం నాడు జరిగిన పత్రికా సమావేశంలో నీతీ అయోగ్ సభ్యుడు డా. వీకే పాల్ ఈ ప్రకటన చేశారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్కు కూడా వీకే పాల్ నేతృత్వం వహిస్తున్నారు. కొత్త కరోనాలోని జన్యుమార్పులు గురించి ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.