గంగూలీ ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటెన్ విడుదల

గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన బీసీసీఐ అధ్యక్షేడు సౌరవ్ గంగూలీ ఆరోగ్యంపై వైద్యులు ఆదివారం బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం గంగూలీ స్థిరంగా ఉన్నారని పేర్కొన్నారు. శనివారం కోరోనరీ ధమనులతో బాధపడ్డాడని, ఆ సమస్యను పరిష్కరించామన్నారు. ప్రస్తుతం గంగూలీ విశ్రాంతి తీసుకుంటున్నాడన్నారు. అతనికి బీపీ నార్మల్ గానే ఉందని, ఆక్సిజన్ లెవల్ కూడా 98 శాతం ఉందన్నారు. అయితే ఆయన పూర్తిగా కోలుకున్న తరువాత యాంజియోప్లాస్టీ నిర్వహించడంపై నిర్ణయం తీసుకుంటామని వైద్యులు తెలిపారు. ‘ట్రిపుల్ నాళాల వ్యాధి కారణంగా […]

Written By: Velishala Suresh, Updated On : January 3, 2021 11:10 am
Follow us on

గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన బీసీసీఐ అధ్యక్షేడు సౌరవ్ గంగూలీ ఆరోగ్యంపై వైద్యులు ఆదివారం బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం గంగూలీ స్థిరంగా ఉన్నారని పేర్కొన్నారు. శనివారం కోరోనరీ ధమనులతో బాధపడ్డాడని, ఆ సమస్యను పరిష్కరించామన్నారు. ప్రస్తుతం గంగూలీ విశ్రాంతి తీసుకుంటున్నాడన్నారు. అతనికి బీపీ నార్మల్ గానే ఉందని, ఆక్సిజన్ లెవల్ కూడా 98 శాతం ఉందన్నారు. అయితే ఆయన పూర్తిగా కోలుకున్న తరువాత యాంజియోప్లాస్టీ నిర్వహించడంపై నిర్ణయం తీసుకుంటామని వైద్యులు తెలిపారు. ‘ట్రిపుల్ నాళాల వ్యాధి కారణంగా అతనికి మరొక యాంజియోప్లాస్టీ అవసరం. కానీ అతని ఆరోగ్యం ఆధారంగా దానిని నిర్వహిస్తాం. ప్రస్తుతానికి గంగూలీ ఆరోగ్యంగానే ఉన్నాడు.’ అని గంగూలీకి చికత్స చేసిన వైద్యుడొకరు తెలిపారు.