Homeజాతీయం - అంతర్జాతీయంDonald Trump: ఆపరేషన్‌ సిందూర్‌ : మరో బాంబు పేల్చిన డొనాల్డ్ ట్రంప్

Donald Trump: ఆపరేషన్‌ సిందూర్‌ : మరో బాంబు పేల్చిన డొనాల్డ్ ట్రంప్

Donald Trump: ఇంతకాలం భారత్‌–పాక్‌ యుద్ధాన్ని తానే ఆపానని చెప్పుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. నోబెల్‌ శాంతి బహుమతి కోసం ప్రయత్నించారు. ఇప్పుడు నోబెల్‌ ప్రైజ్‌ రాకపోయినా.. ఆపరేషన్‌ సిందూర్‌ గురించి మాట్లాడడం మాత్రం ఆపడం లేదు. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌–పాకిస్తాన్‌ ఘర్షణ సమయంలో ‘‘సరికొత్త, అందమైన ఏడు విమానాలు విధ్వంసం అయ్యాయి, దీంతో పరిస్థితి తీవ్రమైంది’’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడ అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.

పాకిస్తాన్‌కు చైనా మద్దతు గుట్ట బయట పెట్టారా?
డిఫెన్స్‌ నిపుణుల అంచనా ప్రకారం, ట్రంప్‌ సూచన చైనా సరఫరా చేసిన తాజా జే–10సీ ఫైటర్‌ జెట్‌ల దిశగా ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లు పాకిస్తాన్‌ వాయుసేనకు ఇటీవలే చేరాయి. ఇవి చైనాలోని చెంగ్‌డు ఏరోస్పేస్‌ సంస్థ రూపొందించిన అధునాతన యుద్ధవిమానాలు. సుదీర్ఘ రేంజ్, అధిక మానవరహిత సామర్థ్యం, ఎలక్ట్రానిక్‌ వార్‌ ఫీచర్లతో ఇవి నూతన తరగతికి చెందినవిగా పరిగణించబడుతున్నాయి. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో కొన్ని జే–10సీ విమానాలు, భారత ఆధునిక యుద్ధవిమానాల మధ్య తీవ్రమైన యుద్ధ జరిగినట్లు విదేశీ క్షేత్ర నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ సందర్భంలో ట్రంప్‌ వ్యాఖ్యలు అజ్ఞాత సమాచారం ఆధారంగా ఉన్నాయా లేక ఇంటెలిజెన్స్‌ బ్రీఫింగ్‌లో భాగమా అనేది స్పష్టంగా లేదు.

స్పందించని పాకిస్తాన్‌.. భారత్‌ కూడా మౌనం…
ట్రంప్‌ వ్యాఖ్యలపై పాకిస్తాన్‌ సైనిక వ్యవస్థ ఇప్పటి వరకు అధికారిక వివరణ ఇవ్వలేదు. అదే సమయంలో భారత్‌ రక్షణ విభాగం కూడా స్పందనకు దూరంగా ఉంది. రెండు దేశాలు మౌనం పాటించడం వల్ల, ఇటీవల గగనతలంలో యుద్ధం జరిగిందా లేదా అన్న వార్తలు ఇంకా ఊహాగానంగానే మిగిలిపోయాయి.

ప్రాంతీయ ఉద్రిక్తతలపై ప్రభావం
ట్రంప్‌ వ్యాఖ్యలతో దక్షిణాసియా రాజకీయలో మరోమారు రాజకీయ ఘర్షణ వాతావరణం నెలకొంది. అమెరికా ఈ సందర్భంలో మధ్యవర్తి పాత్రలో ఉంటుందా లేదా పాక్షిక మద్దతు వైఖరి ప్రదర్శిస్తుందా అన్న ప్రశ్నలూ వెల్లువెత్తాయి. చైనా మౌనం, పాకిస్తాన్‌ ఆర్థిక పరిమితులు, భారత వ్యూహాత్మక దళాల సమతుల్యత కొత్త సమీకరణాలను సూచిస్తున్నాయి.

ఏడు యుద్ధవిమానాల విషయం వాస్తవమా తప్పుడు అభిప్రాయమా అనేది ఇంకా నిర్ధారణకు రాలేదు. అయినప్పటికీ, ఈ పరిస్థితి భారత్‌–పాక్‌ మధ్య ఉన్న ఉద్రిక్తతలకు కొత్త మలుపు తీసుకురావచ్చు. ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ ప్రకటన కాకుండా, భవిష్యత్తు కూటమి సమతులతలకు సంకేతం కావచ్చని రక్షణ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version