
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 50,210 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం విడుదల చేసిన బులిటెన్లో పేర్కొంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 83,64,086 కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 704 మంది వైరస్ సోకి మరణించారు. దీంతో 1,24,315కి మరణాల సంఖ్యకు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 5,33,787 యాక్టివ్ కేసులు ఉండగా.. 76,11,809మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా దేశంలో మొత్తం నమోదైన కేసులలో 1.49 శాతం మరణాల రేటు ఉండగా, యాక్టివ్ కేసుల శాతం 6.31గా ఉంది.