పశ్చిమ బెంగాల్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న మమతా బెనర్జీకి సొంత పార్టీ మంత్రి భారీ షాక్ ఇచ్చారు. తృణమూల్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మంత్రి సువేందు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను గవర్నర్ జగదీప్ నకు అందించారు. రవాణా, జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఎమ్మెల్యేగానే కొనసాగనున్నారు. నందిగ్రామ్ నియోజకవర్గానికి చెందిన సువేంద్ వచ్చే ఎన్నికల్లో బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొంత కాలంగా ఆయన పార్టీ విధానాలలు నచ్చకపోవడంతో పలు కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన రాజీనామా చేయడంతో పార్టీలో చర్చనీయాంశంగా మారింది.