
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 61,871 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 74,94,552 కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 1,033 మంది వైరస్ సోకి మరణించారు. దీంతో 1,14,031కి మరణాల సంఖ్యకు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 7,83,311 యాక్టివ్ కేసులు ఉండగా.. 65,97,209 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం విడుదల చేసిన బులిటెన్లో పేర్కొంది. కాగా దేశవ్యాప్తంగా రికవరీ రేడు 88.03 శాతం ఉండగా మరణాల రేటు 1.52 శాతంగా ఉంది.