
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 55,838 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం విడుదల చేసిన బులిటెన్లో పేర్కొంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 77,06,946 కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 702 మంది వైరస్ సోకి మరణించారు. దీంతో 1,16,616 కి మరణాల సంఖ్యకు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 7,15,812 యాక్టివ్ కేసులు ఉండగా.. 68,74,518 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.