
కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 30,548 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 435 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 88,45,127గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,30,070కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,65,478 యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 82,49,578 గా ఉంది. గత పది రోజులుగా దేశంలో 40 నుంచి 50 వేల మధ్య కరోనా కేసులు నమోదవగా సోమవారం నాటి కేసుల్లో 30 వేలకు తగ్గాయి. గతంతో పోలీస్తే కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కాగా మరణాల రేటు 1.47 శాతంగా ఉంది. రికవరీ రేటు 93.27శాతంగా ఉంది.