HomeజాతీయంIndependence Day 2023 : ఆగస్టు 10 నుంచి 15 దాకా ఏం జరిగింది? నరాలు...

Independence Day 2023 : ఆగస్టు 10 నుంచి 15 దాకా ఏం జరిగింది? నరాలు తెగే ఉత్కంఠ ఎందుకు నెలకొంది

Independence Day 2023 : పాకిస్థాన్‌, భారత్‌లకు 1947 ఆగస్టు 14, 15 తేదీల్లో స్వాతంత్య్రం సిద్ధించింది. రెండు దేశాల ప్రజలు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. అయితే అంతకుముందు ఏం జరిగింది.. ముఖ్యంగా ఆగస్టు 10 నుంచి 15 వరకు రెండు ప్రాంతాల్లో ఉత్కంఠమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఆగస్టు 10..

రాజసంస్థానాలు బాగా ఒత్తిడిలో ఉన్నాయి. భారత్‌, పాకిస్థాన్‌లలో ఏదో ఒకదానిలో విలీనం కావాలని కాంగ్రెస్‌, ముస్లింలీగ్‌ నేతలు మహారాజాలపై ఒత్తిడి తీసుకొచ్చారు. పాక్‌ అనుకూల సింధీ ముస్లింలు జునాగఢ్‌ నవాబును చుట్టుముట్టి పాక్‌లో చేరాలని పట్టుబట్టారు. రాజా యశ్వంత్‌రావు సారథ్యంలోని సందూర్‌ రాజసంస్థానం భారత్‌లో కలిసేందుకు అంగీకరించింది. దేశవిభజన కారణంగా అటు వైపు వారు ఇటు.. ఇటువైపు వారు అటు వెళ్లేందుకు 30 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.

ఆగస్టు 11..

పాక్‌కు వెళ్లే వేల మంది ప్రయాణికులతో ఢిల్లీ రైల్వే స్టేషన్‌ కిక్కిరిసింది. పాక్‌ రాజ్యాంగ సభ సమావేశంలో మహ్మదాలీ జిన్నా తొలి ప్రసంగం చేశారు. పాకిస్థాన్‌ తన జాతీయ జెండాను ఖరారు చేసుకుంది. అమీరుద్దీన్‌ కిద్వాయ్‌ దీనిని రూపొందించారు. భారత్‌లో చేరేందుకు మణిపూర్‌ సంస్థానం అంగీకరించింది. భారత్‌లో దేశభక్తి మిన్నంటింది. వందేమాతరం, ‘1857’ వంటి సినిమాల్లోని గీతాలు ఆలపిస్తూ ప్రజలు వీధుల్లో తిరుగాడారు.

ఆగస్టు 12..

భారత్‌, పాకిస్థాన్‌లతో ‘యథాతథ స్థితి’ ఒప్పందానికి కశ్మీరు మహారాజా హరిసింగ్‌ ప్రతిపాదన. ఢిల్లీ డాన్‌ దినపత్రిక కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఎడిటర్‌ అల్తాఫ్‌ హుస్సేన్‌ ఇంటిని దుండగులు తగలబెట్టారు . రెండు దేశాలను విభజించే సరిహద్దు రేఖలు సిద్ధమయ్యాయి.

ఆగస్టు 13..

పాకిస్థాన్‌లో కలిసేందుకు రైళ్లు ఎక్కడానికి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ముస్లిం మహిళలు  కిక్కిరిసిపోయారు. భారత్‌లో త్రిపుర సంస్థానాన్ని విలీనం చేసే ఒప్పందంపై త్రిపుర మహారాణి కంచనప్రవ దేవి సంతకం చేసింది. ఫెడరల్‌ కోర్టు చీఫ్‌ జస్టిస్‌ హరిలాల్‌ జెకిసుందాస్‌ కనియా భారత సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

ఆగస్టు 14..

స్వతంత్ర పాకిస్థాన్‌ ఆవిర్భవించింది. తొలి గవర్నర్‌ జనరల్‌గా మహ్మదాలీ జిన్నా బాధ్యతల స్వీకరించారు.. మొట్టమొదటి ప్రధానిగా లియాఖత్‌ ఆలీ ఖాన్ నియమితులయ్యారు. ఢిల్లీలో మౌంట్‌బాటన్‌ నివాసంపై బ్రిటిష్‌ జాతీయ పతాకం యూనియన్‌ జాక్‌ పతాకం అవనతం చేశారు. భారత రాజ్యాంగ సభ సమావేశమయింది.. స్వతంత్ర భారత తొలి శాసనసభగా ఆవిర్భవించేందుకు చర్చలు జరిగాయి.

ఆగస్టు 15..

అర్ధరాత్రి 12 గంటలకు స్వేచ్ఛావాయువులు పీల్చేందుకు భారతీయులందరూ వీధుల్లోకి వచ్చారు. జన గణ మన గీతం ఆలపించారు. భారత ప్రథమ ప్రధానిగా నెహ్రూ ప్రమాణ స్వీకారం చేశారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version