HomeజాతీయంPigeonpea seed : కంది పంటలో పాల కంటే ఆరు రెట్లు ఎక్కువ కాల్షియం.. అద్భుతాన్ని...

Pigeonpea seed : కంది పంటలో పాల కంటే ఆరు రెట్లు ఎక్కువ కాల్షియం.. అద్భుతాన్ని ఆవిష్కరించిన ఇక్రిసాట్

Pigeonpea seed coat : కందులు.. పప్పుగా మనం చేసుకునే ఈ పంట తెలియని వారుండరు. ప్రతి శాఖాహార వంటకంలో.. ప్రతీ ఇంట్లోనూ వారంలో కనీసం ఒకసారి అయినా తినే పంట ఇదీ. కందిపప్పు, చారును రెగ్యులర్ గా తినేవారు ఎందరో.. ఎంతో పోషక విలువలు కలిగిన ఈ కందులతో మన ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు అద్భుతాన్నే సృష్టించారు. పెరిగే పిల్లలకు కాల్షియం అవసరం. అది ఎక్కువగా పాలలోనే లభిస్తుంది.కానీ రోజూ పాలను పిల్లలు తాగడం లేదు. తద్వారా వారి ఎముకల ఎదుగుదల లేక వివిధ వ్యాధులకు కారణం అవుతోంది. పెద్దయ్యాక కీళ్ల నొప్పులు, వృద్ధాప్యంలోనూ వ్యాధులకు కారణం అవుతోంది. అందుకే పాల కంటే ఆరు రెట్లు ఎక్కువ కాల్షియం ఉండేలా సరికొత్త కంది వంగడాన్ని మన ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.

ఈ ఎరుపు రంగులోని పావురం కంది పప్పులో కాల్షియం పుష్కలంగా ఉంటుందని తేల్చారు. ఇది పిల్లలకు గొప్ప పోషక ఆహారంగా.. మినరల్ సప్లిమెంట్‌ గా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కంది పంటలో జన్యుమార్పిడి చేసి కాల్షియం ఎక్కువ ఉండేలా చేసిన వీరి పరిశోధన గొప్ప ఫలితాన్ని ఇచ్చినట్టైంది.

ఎముకల నిర్మాణానికి కాల్షియం కీలకం. కాల్షియం లోపిస్తే శిశువులు, పిల్లలలో రికెట్స్ వ్యాధి వస్తుంది. ఎముకలు విరిగిపోయి వంగిపోతాయి. పెద్దలలో ఆస్టియోమలాసియా, వృద్ధాప్యంలో బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుంది. భారతీయ ఆహారంలో కాల్షియం క్షీణత బాగా ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. మన ఆహారపు అలవాట్లు.. ప్రాథమిక వనరుల ద్వారా ఈ కాల్షియం లోపాన్ని భర్తీ చేయలేమని నివేదికలు నొక్కి చెప్పాయి.

ఈ కొత్తరకం కంది పంటలో సీడ్ కోట్‌లో పాల కంటే ఆరు రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది. ఇది బోలు ఎముకల వ్యాధి మరియు రికెట్స్ వంటి ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి గొప్పగా ఉపయోగపడుతుంది. ఆహారం మరియు ఔషధ పరిశ్రమలకు సంభావ్య విలువైన ఇన్‌పుట్‌గా దోహదపడుతుంది.

ఈ ఫలితాలను ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ-ఎరిడ్ ట్రాపిక్స్ (ICRISAT) పీర్-రివ్యూడ్ జర్నల్ సస్టైనబిలిటీలో ప్రచురించింది. ICRISAT జన్యుబ్యాంక్ నేతృత్వంలోని పరిశోధనలో 100 ml పాలలో 120 mg కాల్షియం ఉంటే కేవలం 100 గ్రాముల పావురం సీడ్ కందిపప్పులో 652 mg కాల్షియం ఉందని కనుగొన్నారు. పోషకాల జీవ లభ్యతను అంచనా వేయడానికి తదుపరి పరిశోధన పురోగతిలో ఉందన్నారు. మానవ శరీరానికి రోజుకు 800-1,000 mg కాల్షియం అవసరం. ఈ కందిపప్పు సమకాలీన భారతీయ ఆహారంలో తీసుకుంటే భర్తీ అవుతుందని నివేదికలు సూచిస్తున్నాయి.

పావురం రకం కంది విత్తనాలు దక్షిణాసియా, మధ్య అమెరికా మరియు ఆఫ్రికాలోని పాక్షిక-శుష్క ఉష్ణమండల ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా పండించే పప్పు పంట. ఇది బాగా సంవృద్ధిగా ఉండే ప్రోటీన్ మూలంగా పనిచేస్తుంది. ప్రపంచంలోనే భారతదేశంలో కందిపప్పును బాగా వినియోగిస్తారు. 2020 సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా 82% సాగు అయితే 77% ఉత్పత్తిని కలిగి ఉంది. ఈ పప్పు (పొట్టు తీసిన ధాన్యం) వివిధ రూపాల్లో వినియోగించబడుతుంది. ఇది తృణధాన్యాలతో కలిపి, ధోక్లా, దాల్ పట్టీలు, టేంపే, అడై మరియు కడబా వంటి వివిధ ప్రసిద్ధ వంటకాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.

అధ్యయనం కోసం, ICRISATలో 2019 మరియు 2020 వర్షాకాలంలో (ఖరీఫ్) పెంచిన 600 పావురం రకం కంది పంటలో కాల్షియం కంటెంట్ (652 mg)గా ఉంది. ఇది బియ్యం ఊక, గోధుమ ఊక మరియు వోట్ ఊకతో పోలిస్తే చాలా ఎక్కువ కావడం విశేషం.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version