HomeజాతీయంPadma Awards 2024: దేశ చరిత్రలో తొలిసారి.. ఒకే గ్రామానికి 2 పద్మ అవార్డులు

Padma Awards 2024: దేశ చరిత్రలో తొలిసారి.. ఒకే గ్రామానికి 2 పద్మ అవార్డులు

Padma Awards 2024: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏటా రిపబ్లిక్ డే ముందు రోజు పద్మ అవార్డులు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది పద్మ అవార్డులను ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు ఎనిమిది అవార్డులు వచ్చాయి. దేశంలో రెండో అత్యున్నత పురస్కారంగా భావించే పద్మ విభూషణ్ కు మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవి ఎంపికయ్యారు. ఇక తెలంగాణకు ఏకంగా ఐదు పద్మశ్రీలు దక్కాయి. బుర్ర వీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, కళా విభాగంలో వేలు ఆనందాచారి, విద్య, సాహిత్య రంగాల్లో కేతావత్ సోమ్లాల్, కూరెళ్ళ విఠలాచార్య ఉన్నారు.

అయితే ఈసారి ఒకే గ్రామానికి చెందిన ఇద్దరికి పద్మశ్రీలు రావడం విశేషం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బొల్లేపల్లి గ్రామానికి చెందిన కేతావత్ సోమ్లాల్ కు పద్మశ్రీ అవార్డు వరించింది. గతంలో అదే గ్రామానికి చెందిన రావి నారాయణరెడ్డి కి సైతం పద్మశ్రీ దక్కడం విశేషం. దీంతో ఒకే గ్రామానికి చెందిన వారికి రెండు పద్మ అవార్డులు రావడం దేశ చరిత్రలోనే మొదటిసారి అని తెలుస్తోంది.

అయితే ఈసారి పూర్తిగా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వారికి పద్మ అవార్డులు లభించడం విశేషం. వివిధ రంగాల్లో రాణిస్తున్న వారు.. వారి నైపుణ్యం, ప్రతిభకు తగ్గ గుర్తింపు రాని వారిని సైతం పద్మ అవార్డులు వరించడం విశేషం. ఎంపిక ప్రక్రియలో పారదర్శకత పాటించినట్లు తెలుస్తోంది. మొత్తం దేశవ్యాప్తంగా 137 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. అయితే ఇందులో కొందరికి మరణం తరువాత అరుదైన గౌరవం దక్కడం విశేషం. తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట వేయడం.. ఐదు పద్మ విభూషణ్ పురస్కారాలకు గాను.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరికి ఎంపిక చేయడం గమనార్హం. మార్చి, ఏప్రిల్ నెలలో పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పద్మ అవార్డుల్లో సరైన గుర్తింపు లభించడం పై తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...
Oktelugu Epaper
Exit mobile version