
టాలీవుడ్ స్టార్లు రాంచరణ్, ఎన్టీఆర్ లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. ప్రస్తుతం క్లైమాక్స్ తీస్తున్న ఈ మూవీ చివరి దశకు వచ్చినట్టు సమాచారం. దర్శకధీరుడు రాజమౌళి హెవీ క్లైమాక్స్ ను తీస్తున్నట్టు చిత్రం యూనిట్ తెలిపింది.
Also Read: గోవాలో శ్రీముఖి రచ్చ: వాళ్లతో ఆ ఫొటోలు వదిలి షాకిచ్చిన యాంకర్
కొద్దిరోజులుగా ఆర్ఆర్ఆర్ భారీ క్లైమాక్స్ ను తీస్తున్న మేకర్స్ తాజాగా ఒక కూల్ పోస్ట్ ను తమ ఫాలోవర్స్ తో పంచుకున్నారు.
కొమురం భీం రాంచరణ్, భీం ఎన్టీలు ఆన్ లోకేష్ లో సేదతీరుతున్న ఫొటోలతో ‘ఆర్ఆర్ఆర్’ ఒక పోస్ట్ చేసింది. తమ హీరోలు భారీ క్లైమాక్స్ సీన్ కోసం తీవ్రంగా కష్టపడి ఆ సెషన్ నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నారని పోస్ట్ చేశారు.
Also Read: ‘శృతి హాసన్’ డేటింగ్ చేసినవారంతా వాళ్ళే !
ఇప్పటికే అద్భుతమైన విజువల్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్ లతో ఈ సినిమా తెరకెక్కించారు. ప్రస్తుతం భారీ క్లైమాక్స్ ను భీకరంగా రాజమౌళి తీస్తున్నాడట.. ఈ క్లైమాక్స్ మధ్యలో హీరోలు సేదతీరిన ఫొటోను షేర్ చేయగా అది వైరల్ అయ్యింది.
Unwinding in the midst of vigorous practice sessions for THE CLIMAX!! 🤩 #RRRMovie #RRR #RRRDiaries pic.twitter.com/OXqHkh4sUc
— RRR Movie (@RRRMovie) February 5, 2021