
చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజాపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో ఆమె వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ పలువురు మండిపడుతున్నారు. ఇప్పటికే ఇదే జిల్లాకు చెందిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే భారీ ర్యాలీ నిర్వహించి నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు. ఈ ర్యాలీలో పాల్గొన్న 8 మంది ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా వైరస్ సోకింది. ఈ వ్యవహారంతో అక్కడి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రభుత్వానికి చిక్కులు తెచ్చిపెట్టారు. ఈ విషయంపై సీఎం సమాధానం చెప్పాలని విపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా నగరి ఎమ్మెల్యే రోజా వ్యవహరించిన తీరు వివాదాస్పదం అయ్యింది. వివరాల్లోకి వెళ్తే, పుత్తూరు సుందరయ్యనగర్ లో బోరుబావి ప్రారంభోత్సవానికి రోజా వెళ్లారు. ఆ సమయంలో వైసీపీ శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అక్కడి జనం ఆమెపై పూలు చల్లుతుండగా, ఆమె ముందుకు కదిలారు. ఆమెతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులు కలిసి వెళ్లారు. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో నడిచే దారిలో పూలు జల్లించుకోవడం ఆమె పిచ్చికి పరాకాష్టగా ప్రజలు అభివర్ణిస్తున్నారు.
దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై విపక్ష నేతలు, కార్యకర్తలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని దుయ్యబడుతున్నారు. రోజా తీరుతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారంటూ విమర్శించారు. అధికార పక్షానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఇదే తీరుతో వ్యవహరించడం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తోంది.
Despite lockdown regulations in place, in Nagari constituency of Chittoor district, MLA RK Roja inaugurated a new borewell and distributed groceries to them. Villagers were made to shower flower petals on her feet as she entered the village. #AndhraPradesh pic.twitter.com/KznAuD7WiO
— Paul Oommen (@Paul_Oommen) April 21, 2020