Revanth Reddy: ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు సమన్లు

ఓటుకు నోటు కేసు వ్యవహారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఈడీ కేసులు విచారణ జరిపే నాంపల్లి ఎంఎస్ జే కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 4న విచారణకు రావాలని అందులో పేర్కొంది. ఓటుకు నోటు కేసులో ఈడీ ఛార్జి షీట్ ను విచారణకు స్వీకరించిన కోర్టు రేవంత్ తో పాటు తెరాస ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు సమన్లు పంపింది. వీరితో పాటు కోర్టు సమన్లు జారీ చేసిన వారిలో సెబాస్టియన్, ఉదయ్ సింహ, […]

Written By: Suresh, Updated On : September 3, 2021 10:42 am
Follow us on

ఓటుకు నోటు కేసు వ్యవహారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఈడీ కేసులు విచారణ జరిపే నాంపల్లి ఎంఎస్ జే కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 4న విచారణకు రావాలని అందులో పేర్కొంది. ఓటుకు నోటు కేసులో ఈడీ ఛార్జి షీట్ ను విచారణకు స్వీకరించిన కోర్టు రేవంత్ తో పాటు తెరాస ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు సమన్లు పంపింది. వీరితో పాటు కోర్టు సమన్లు జారీ చేసిన వారిలో సెబాస్టియన్, ఉదయ్ సింహ, ముత్తయ్య జెరుసలేం, వేం కృష్ణ కీర్తన్ లు ఉన్నారు.