టాప్ దర్శకుడి చేతికి చిక్కిన నితిన్

రేసుగుర్రం, సైరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు సురేందర్ రెడ్డి ఇప్పుడు తెలుగులో టాప్ లో ఉన్నాడు. ఆయనతో సినిమాలు చేయడానికి చాలా మంది ఉత్సాహం చూపుతున్నారు. అయితే సైరా సినిమా తర్వాత అక్కినేని అఖిల్ తో సినిమా చేసేందుకు సురేందర్ రెడ్డి ప్లాన్ చేశారు. అఖిల్ తర్వాత మూవీని నితిన్ తో చేసేందుకు సురేందర్ రెడ్డి సిద్ధమైనట్టు టాలీవుడ్ తాజా సమాచారం. Also Read: అనసూయ విరహ వేదన మామూలుగా లేదే? నితిన్ […]

Written By: NARESH, Updated On : January 3, 2021 12:56 pm
Follow us on

రేసుగుర్రం, సైరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు సురేందర్ రెడ్డి ఇప్పుడు తెలుగులో టాప్ లో ఉన్నాడు. ఆయనతో సినిమాలు చేయడానికి చాలా మంది ఉత్సాహం చూపుతున్నారు. అయితే సైరా సినిమా తర్వాత అక్కినేని అఖిల్ తో సినిమా చేసేందుకు సురేందర్ రెడ్డి ప్లాన్ చేశారు. అఖిల్ తర్వాత మూవీని నితిన్ తో చేసేందుకు సురేందర్ రెడ్డి సిద్ధమైనట్టు టాలీవుడ్ తాజా సమాచారం.

Also Read: అనసూయ విరహ వేదన మామూలుగా లేదే?

నితిన్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కమర్షియల్ మాస్ ఎంటర్ టైన్ మెంట్ గా ఓ కథను రెడీ చేసినట్టు సమాచారం. టాగూర్ మధు ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే నితిన్ తో అంథాదూన్ రిమేక్ ను టాగోర్ మధు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో సినిమాను నిర్మించేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

నిజానికి ముందే ఒప్పుకున్న ప్రకారం సురేందర్ రెడ్డి ఎప్పుడో టాగోర్ మధుతో సినిమా తీయాల్సి ఉన్నా అది లేట్ అయ్యి ఇప్పుడు నితిన్ తో సినిమాకు ఓకే అయ్యింది.

Also Read: సౌత్ ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ సూర్యకే?

అఖిల్ తో సినిమా పూర్తయ్యాక నితిన్ తో సినిమాను సురేందర్ రెడ్డి పట్టాలెక్కిస్తాడు. మరి వరుస కమర్షియల్ మూవీలు తీసే సురేందర్ రెడ్డి హీరో నితిన్ ను ఎలా చూపిస్తాడన్నది వేచిచూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్