జనాలకు కరెంట్ బంద్ చేస్తేనే టీఆర్ఎస్ విలువ తెలుస్తుందట!

కొత్త అల్లుడు ఇంటికొస్తే మొదట్లో ఎంత మర్యాదలు చేస్తారో అందరికీ తెలిసిందే. తెలంగాణ సీఎంగా కేసీఆర్ గద్దెనెక్కాక కూడా ప్రజలు అలానే ట్రీట్ చేశారు. ఇక అల్లుడు పాత బడే కొద్దీ అత్తారింట్లోని పనులు కూడా చేయిస్తారు.. పెద్దగా కేర్ చేయలేదు. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ వచ్చాక పాత అల్లుడు కేసీఆర్ పై జనాలకు మోజు తగ్గింది. అదే ఆయన ఓటమికి దారితీస్తోంది. ఇప్పుడు టీఆర్ఎస్ పై ప్రజల్లో ప్రేమ తగ్గిందని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి హాట్ […]

Written By: NARESH, Updated On : December 15, 2020 4:37 pm
Follow us on

కొత్త అల్లుడు ఇంటికొస్తే మొదట్లో ఎంత మర్యాదలు చేస్తారో అందరికీ తెలిసిందే. తెలంగాణ సీఎంగా కేసీఆర్ గద్దెనెక్కాక కూడా ప్రజలు అలానే ట్రీట్ చేశారు. ఇక అల్లుడు పాత బడే కొద్దీ అత్తారింట్లోని పనులు కూడా చేయిస్తారు.. పెద్దగా కేర్ చేయలేదు. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ వచ్చాక పాత అల్లుడు కేసీఆర్ పై జనాలకు మోజు తగ్గింది. అదే ఆయన ఓటమికి దారితీస్తోంది. ఇప్పుడు టీఆర్ఎస్ పై ప్రజల్లో ప్రేమ తగ్గిందని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయవర్గాల్లో సంచలనమయ్యాయి.

Also Read: టీఆర్ఎస్ కు షాక్: బీజేపీలోకి మంత్రి సోదరుడు?

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో నూతనంగా ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనం ప్రారంభోత్సవం సందర్భంగా లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ప్రజలకు మరిచిపోయే మనస్తత్వం ఉంటుందని.. వారికి అన్ని వసతులు కల్పిస్తే మరిచిపోయి వేరే మాయలో పడిపోతారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాది పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయాలని సీఎం కేసీఆర్ ను కోరాలని ఆయన వ్యాఖ్యానించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న మేలు సామాన్య ప్రజలకు అర్థం కావడం లేదని లక్ష్మారెడ్డి అన్నారు. 24 గంటలు ఉచిత కరెంట్ కాకుండా కేవలం 3, 4 గంటలు కరెంట్ ఇవ్వాలని.. అప్పుడే అందరూ భజన చేసుకుంటూ కరెంట్ విలువ గుర్తిస్తారని సెటైర్లు వేశారు.

Also Read: తెలంగాణ వచ్చాకే నిరుద్యోగం పెరిగిందా..!

జనాలకు ప్రభుత్వం విలువ తెలియాలంటే ఇప్పుడు సంక్షేమ పథకాలను ఆపేసి ఎన్నికలు ఏడాది ఉన్నాయనగా మళ్లీ ప్రారంభిస్తే బాగుంటుందని లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనం మంచి వారు అనలా? అమాయకులు అనాలో తెలియడం లేదని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి వాపోయారు. పనికిమాలిన భావాలకు లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్