బెజవాడ మళ్లీ భగ్గుమంది!

బెజవాడ ఒకప్పుడు రౌడీలకు పేరొందింది.. వంగవీటి, నెహ్రూ హయాంలో ఆధిపత్య పోరుతో బెజవాడ రగిలిపోయింది. వారు అంతరించాక వారి వారసులు వెలుగులోకి వచ్చినా తండ్రులంతా పరపతిపేరు సంపాదించుకోలేదు. దీంతో బెజవాడ కూల్ అయిపోయింది. అయితే వైసీపీ పాలనలో మరోసారి బెజవాడ, కృష్ణ జిల్లాలో రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. టీడీపీ, వైసీపీ ఫైట్ లో నేతలు మళ్లీ రగిలిపోతున్నారు. ముఖ్యంగా టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన నేతలకు.. ఆది నుంచి వైసీపీలో ఉన్న నేతలకు మధ్య విభేదాలతో భగ్గుమంటోంది. […]

Written By: NARESH, Updated On : December 20, 2020 5:49 pm
Follow us on

బెజవాడ ఒకప్పుడు రౌడీలకు పేరొందింది.. వంగవీటి, నెహ్రూ హయాంలో ఆధిపత్య పోరుతో బెజవాడ రగిలిపోయింది. వారు అంతరించాక వారి వారసులు వెలుగులోకి వచ్చినా తండ్రులంతా పరపతిపేరు సంపాదించుకోలేదు. దీంతో బెజవాడ కూల్ అయిపోయింది. అయితే వైసీపీ పాలనలో మరోసారి బెజవాడ, కృష్ణ జిల్లాలో రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. టీడీపీ, వైసీపీ ఫైట్ లో నేతలు మళ్లీ రగిలిపోతున్నారు. ముఖ్యంగా టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన నేతలకు.. ఆది నుంచి వైసీపీలో ఉన్న నేతలకు మధ్య విభేదాలతో భగ్గుమంటోంది.

విజయవాడ వైసీపీలో ఫెక్సీల రగడ మొదలైంది. తూర్పు నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య కోల్డ్ వార్ కాస్తా ఇప్పుడు ఫ్లెక్సీలు చించుకునే వరకు వచ్చింది. వైసీపీ అధినేత, సీఎం జగన్ రేపటి పుట్టినరోజును పురస్కరించుకొని విజయవాడలో వైసీపీలోని రెండు గ్రూపులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. అయితే తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ ఫొటో ఉన్న ఫ్లెక్సీలపై పేడకొట్టి.. చించివేయడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

21వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా పుప్పాల కుమారిని దేవినేని అవినాష్ ఫైనల్ చేయడంతో అది నచ్చక మరో వర్గం ఈ చర్యలు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. ఈ వివాదం ముదిరి పంచాయితీకి దారితీసింది. చివరకు పోలీసులకు పిర్యాదు చేసుకున్నారు. పోలీసులు రాజీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

అధికార వైసీపీలోకి టీడీపీ నుంచి వచ్చి చేరిన నేతలతో లొల్లి మొదలవుతోంది. ఇప్పటికే నిన్న గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులకు వైసీపీలో ఆదినుంచి ఉన్న వారికి పెద్ద ఫైటింగ్ జరిగింది. అది మరిచిపోకముందే బెజవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ నేత దేవినేని అవినాష్ బ్యానర్స్ చించివేయడం కలకలం రేపింది. అవినాష్ కూడా టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నేత కావడంతో స్వతహాగా వైసీపీలో ఉన్న నేతలు ఆయనపై ఈ చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.