ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో గండం పొంచి ఉందా?

ఎడారి రాష్ట్రంలో రాజకీయాలు మరోసారి కీలక మలుపు తిరగబోతున్నాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. కొద్దినెలల క్రితం రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. సీఎం అశోక్ గెహ్లట్.. డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ల మధ్య నెలకొన్న వివాదాలు చివరకు ప్రభుత్వం కూలేంత వరకు వచ్చింది. Also Read: కోదండరాం ఎందుకు సైలంట్ అయ్యారు.. బరిలో నిలిచేనా? ఈక్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగి నాటకీయ పరిణామాల మధ్య  సచిన్ పైలట్ ను […]

Written By: Neelambaram, Updated On : December 12, 2020 1:43 pm
Follow us on

ఎడారి రాష్ట్రంలో రాజకీయాలు మరోసారి కీలక మలుపు తిరగబోతున్నాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. కొద్దినెలల క్రితం రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. సీఎం అశోక్ గెహ్లట్.. డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ల మధ్య నెలకొన్న వివాదాలు చివరకు ప్రభుత్వం కూలేంత వరకు వచ్చింది.

Also Read: కోదండరాం ఎందుకు సైలంట్ అయ్యారు.. బరిలో నిలిచేనా?

ఈక్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగి నాటకీయ పరిణామాల మధ్య  సచిన్ పైలట్ ను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి తీసుకొచ్చింది. దీంతో ఆ వివాదం సర్దుమణిగి మళ్లీ పాలన గాడిలో పడింది. అయితే గెహ్లాట్ సర్కార్ కు మద్దతు ఇస్తున్న భారతీయ గిరిజన పార్టీ(బీటీపీ) తన మద్దతు ఉపసంహరించుకున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ పరిణామం రాజస్థాన్లో మరోసారి హాట్ టాపిక్ మారింది.

ఇటీవల రాజస్థాన్లో 4,371 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ 1,695 స్థానాల్లో విజయం సాధించగా ప్రతిపక్షంలోని బీజేపీ 1,695 స్థానాల్లో గెలుపొందింది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీటీపీకి మద్దతు తెలుపకపోవడంతో తమ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలైనట్లు ఆపార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే బీటీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించారు.

Also Read: బీజేపీలోకి మాజీ మంత్రి.. చేరికలకు రంగం సిద్ధం?

ఈ ఏడాది ప్రారంభంలో కాంగ్రెస్ రాజకీయ సంక్షోభం నెలకొనగా ప్రభుత్వం బలనిరూపణకు సిద్ధమైంది. ఈ తరుణంలోనే భారతీయ గిరిజన పార్టీ(బీటీపీ) గెహ్లాట్ సర్కార్ మద్దతు తెలిపింది. తాజాగా ఈ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇన్నిరోజులుగా కాంగ్రెస్ ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో మరోసారి రాజస్థాన్లో రాజకీయ సంక్షోభం రానుందా? అనే సందేహాలు కలుగుతున్నాయి.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్