బ్రేకింగ్: ఏప్రిల్ 9న షర్మిల పార్టీ పేరు ప్రకటన.. ఏమిటంటే?

ఊహాగానాలకు తెరపడింది. మీటింగ్ లు ఓ కొలిక్కి వచ్చాయి. అందరి అభిప్రాయాలు క్రోడీకరించిన వైఎస్ షర్మిల ఎట్టకేలకు తెలంగాణ రాజకీయాల్లో రంగ ప్రవేశ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఏప్రిల్ 9న వైఎస్ షర్మిల పార్టీ ప్రకటన చేయబోతున్నట్టు సమాచారం. షర్మిల ప్రధానంగా మూడు పేర్లను పరిశీలించినట్టు సమాచారం. ఇందులో ప్రధానంగా ‘వైఎస్ఆర్.టీపీ, వైఎస్ఆర్ పీటీ, రాజన్న రాజ్యం’ అనే మూడు పేర్లను షర్మిల పరిశీలిస్తున్నట్టు సమాచారం. అన్నీ ఓకే అయితే మే 14 నుంచి లోటస్ […]

Written By: NARESH, Updated On : March 1, 2021 7:12 pm
Follow us on

ఊహాగానాలకు తెరపడింది. మీటింగ్ లు ఓ కొలిక్కి వచ్చాయి. అందరి అభిప్రాయాలు క్రోడీకరించిన వైఎస్ షర్మిల ఎట్టకేలకు తెలంగాణ రాజకీయాల్లో రంగ ప్రవేశ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఏప్రిల్ 9న వైఎస్ షర్మిల పార్టీ ప్రకటన చేయబోతున్నట్టు సమాచారం.

షర్మిల ప్రధానంగా మూడు పేర్లను పరిశీలించినట్టు సమాచారం. ఇందులో ప్రధానంగా ‘వైఎస్ఆర్.టీపీ, వైఎస్ఆర్ పీటీ, రాజన్న రాజ్యం’ అనే మూడు పేర్లను షర్మిల పరిశీలిస్తున్నట్టు సమాచారం. అన్నీ ఓకే అయితే మే 14 నుంచి లోటస్ పాండ్ వేదికగా పార్టీ కార్యకలాపాలు ప్రారంభించనున్నారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ తో విభేదించి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి ఒంటరిగా ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే షర్మిల పెట్టడం జగన్ కు ఇష్టం లేదని స్వయంగా ఆమె ప్రకటించారు కూడా. టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా ఆమె పార్టీ ఉండబోతున్నట్టు సమాచారం.

షర్మిల పార్టీ ప్రకటన ఖమ్మం వేదికగా జరుగనున్నట్లు తెలిసింది. ఆత్మీయ సమ్మేళనంలో పార్టీ పేరుతోపాటు విధి విధానాలను ఆమె ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ ప్రకటనపై జిల్లాల నేతలతో షర్మిల సుధీర్ఘంగా చర్చించినట్టు సమాచారం.