ఏపీ సీఎం జగన్ ఉగాది కానుక

జగన్ సర్కార్ సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. వారికి ఫలాలు నేరుగా అందించేందుకే ఏకంగా ఏపీ ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది. అయితే అరకొర జీతాలతో తమ బతుకులు సాగడం లేదని వలంటీర్లు తాజాగా జీతాల కోసం పోరుబాట పట్టారు. ఈ క్రమంలోనే ఈ ఆందోళనకు స్పందించిన సీఎం జగన్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో అక్రమాలు నివారించేందుకు వాటిని నేరుగా లబ్ధిదారులకు అందించేందుకు వలంటీర్లను నియమించింది. ఏపీ వ్యాప్తంగా గ్రామ […]

Written By: NARESH, Updated On : February 24, 2021 12:30 pm
Follow us on

జగన్ సర్కార్ సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. వారికి ఫలాలు నేరుగా అందించేందుకే ఏకంగా ఏపీ ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది. అయితే అరకొర జీతాలతో తమ బతుకులు సాగడం లేదని వలంటీర్లు తాజాగా జీతాల కోసం పోరుబాట పట్టారు. ఈ క్రమంలోనే ఈ ఆందోళనకు స్పందించిన సీఎం జగన్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో అక్రమాలు నివారించేందుకు వాటిని నేరుగా లబ్ధిదారులకు అందించేందుకు వలంటీర్లను నియమించింది. ఏపీ వ్యాప్తంగా గ్రామ సచివాలయాలకు అనుబంధంగా దాదాపు లక్షల మంది పనిచేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేరవేరుస్తున్న వలంటీర్లు ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ప్రతిపక్షాలు సైతం వలంటీర్ వ్యస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇటీవల జరిగిన ప్రణాళిక సమీక్షా సమావేశంలో జగన్ వలంటీర్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. వలంటీర్లకు సీఎం జగన్ ఓ బహిరంగ లేఖ రాశారు. వలంటీర్లు చేసేది సేవ అన్నారు. వీరి కోసం ప్రతీ ఏటా ఉగాది రోజు గ్రామ వాలంటీర్లకు పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించారు. ఈ ప్రొత్సాహకం నగదుతో పాటు బహుమతి రూపంలో ఇవ్వనున్నారట. ఈ మేరకు కార్యచరణ సిద్ధం చేయాలని అధికారులకు జగన్ ఆదేశించారట.

నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా ఉత్తమ వాలంటీర్లను ఎంపిక చేయాలని తెలిపారు. ఈ సత్కారాలకు సేవారత్న,సేవామాత్ర లాంటి పేర్లను పరిశీలిస్తున్నారు. మరోవైపు గ్రామాలో డిజిటల్ అసిస్టెంట్ ద్వారా డేటా క్రోడీకరణ, రైతు భరోసా కేంద్రాల నుంచి ఈ క్రాపింగ్ డేటా సేకరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ డేటా ఆధారంగా పరిపాలన లోపాలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవచ్చని జగన్ తెలిపారట.

వలంటీర్ల వ్యవస్థ ద్వారా లక్ష్యాలను చేరుకునే తరుణంలో ఐక్యరాజ్య సమితి దాని అనుబంధ సంఘాలు సహా ప్రపంచ స్థాయి భాగస్వామ్య సంస్థల సహాయం తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, యునెస్కో లాంటి సంస్థలతో కలిసి పనిచేయాలని సూచించారు.