భారత్ కు అరుదైన గౌరవాన్ని ఇచ్చిన అమెరికా

ప్రవాస భారతీయులతో నిండిన అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కార్యవర్గం తాజాగా భారతదేశానికి అరుదైన గౌరవాన్ని ఇచ్చింది.. భారత్ ను అంతర్జాతీయ శక్తిగా అమెరికా గుర్తించింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పాలకవర్గం నిర్ణయించింది. ఇండో -పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు భారత్ కీలక భాగస్వామిగా అని తెలిపింది. ప్రాంతీయంగా శాంతి భద్రతలను నెలకొల్పడంలో భారత్ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెగ్ ప్రైస్ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ప్రపంచ […]

Written By: NARESH, Updated On : February 10, 2021 12:10 pm
Follow us on

ప్రవాస భారతీయులతో నిండిన అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కార్యవర్గం తాజాగా భారతదేశానికి అరుదైన గౌరవాన్ని ఇచ్చింది.. భారత్ ను అంతర్జాతీయ శక్తిగా అమెరికా గుర్తించింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పాలకవర్గం నిర్ణయించింది.

ఇండో -పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు భారత్ కీలక భాగస్వామిగా అని తెలిపింది. ప్రాంతీయంగా శాంతి భద్రతలను నెలకొల్పడంలో భారత్ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెగ్ ప్రైస్ మంగళవారం విలేకరులతో మాట్లాడారు.

ప్రపంచ వేదికపై భారత్ ప్రాముఖ్యను గుర్తిస్తూ బైడెన్ పాలకవర్గం ప్రకటన చేయడం ఇదే తొలిసారి. అంతకుముందు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తో ఫోన్ లో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఇరు దేశాలు ధీమా వ్యక్తం చేశారు.

ఇక భారత్ పక్కనున్న మయన్మార్ దేశంలో సైనిక తిరుగుబాటు, దాని పర్యవసనాలపై చర్చించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహకారం, కోవిడ్  మహమ్మారి, వాతావరణ మార్పులపైనా మాట్లాడుకున్నారు.

ఇక నుంచి అమెరికాకు భారత్ ప్రధాన వాణిజ్య భాగస్వామిగా అమెరికా ప్రకటించింది. భారత్ లో అమెరికా కంపెనీలు కేంద్రంగా ఉన్నాయని గుర్తించింది.

ఇక చైనాతో భారత్ ఘర్షణ తీరును అమెరికా నిశితంగా పరిశీస్లున్నట్టు తెలిపింది. ఇరు దేశాల మధ్య చర్చలు పరిష్కారానికి దారితీయాలని ఆకాంక్షించారు. పొరుగుదేశాలతో చైనా తీరు తీవ్ర ఆందోళనకరంగా ఉందన్నారు. బెదిరింపు ధోరణి మానుకోవాలని చైనాకు సూచించారు.