Homeబిజినెస్5G Mobiles: అతి తక్కువ ధరకు లభించే 5G మొబైల్స్ ఇవే.. వెంటనే బుక్ చేసుకోండి..

5G Mobiles: అతి తక్కువ ధరకు లభించే 5G మొబైల్స్ ఇవే.. వెంటనే బుక్ చేసుకోండి..

5G Mobiles: ఇప్పుడున్నదంతా టెక్నాలజీ యుగం. ప్రతీ పనిని సాంకేతికాన్ని ఉపయోగించి చేస్తున్నారు. ఏ పని చేయాలన్నా.. ఎవరితోనైనా కమ్యూనికేషన్ మెయింటేన్ చేయాలన్నా మొబైల్ తప్పనిసరి. కేవలం ఇతరులతో మాట్లాడడానికే కాకుండా ఫైల్స్, ఫొటోస్, వీడియోస్ షేర్ చేసుకోవడానికి స్మార్ట్ ఫోన్ ను ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్నారు. ఇటీవల 5G నెట్ వర్క్ అందుబాటులోకి రావడంతో అంతా 5G మొబైల్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా కంపెనీలు 5G మొబైల్స్ ను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. అయితే అప్డేట్ ఫీచర్స్ కలిగి ఉండడంతో కొంచెం ఎక్కువ ధరతో విక్రయిస్తున్నారు. కానీ సామాన్యులను దృష్టిలో పెట్టుకొని ఇతర కంపెనీలు అంతే ఫీచర్స్ కలిగి తక్కువ ధరకు అమ్ముతున్నాయి. అలాంటి ఫోన్ల వివరాలేంటంటే..?

5000 ఎంఏహెచ్ బ్యాటరీ.. 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్, 33 ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సె్ అల్ట్రావైడ్ సెన్సార్ ను కలిగిన రెడ్ మీ నోట 12 ఇప్పుడు 5జీ నెట్ వర్క్ తో అందుబాటులో ఉంది. దీనిని రూ.16,999తో విక్రయిస్తున్నారు. 4 జనరేషన్ 1 ప్రాసెసర్ కలిగిన ఇది 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో పనిచేస్తుంది.

4జీ నెట్ వర్క్ తో వచ్చిన మోటో జీ మొబైల్స్ అత్యధికంగా అమ్ముడు పోయాయి. ఇప్పుడీ కంపెనీ మోటో జీ73 అనే మోడల్ ను 5జీ నెట్ వర్క్ తో మార్కెట్లోకి తీసుకొస్తుంది. మోటో జీ 73 స్మార్ట్ మొబైల్ ధర రూ.18,999కు విక్రయిస్తున్నారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కలిగిన ఈ మొబైల్ 6.5 ఎల్ సీడీ హెచ్ డీ డిస్ ప్లేతో కూడుకొని ఉంటుంది.

ఐక్యూ Z7:మోడల్ చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటుంది. 6.38 అంగుళాల 90Hz ఎమోల్డ్ డిస్ ప్లే దీని సొంతం. కెమెరా విషయానికొస్తే 64 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 16 ఫ్రంట్ కెమెరా ఉంది. 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కలిగిన ఐక్యూ జెడ్ 7 ను రూ.18,999తో విక్రయిస్తున్నారు.

రియల్ మీ 10 Pro 5G 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు చేసే రియల్ మీ 10 ప్రో 5జీ 120 Hz రిఫ్రెస్ రేట్ తో ఎల్ సీడీ ప్యానెల్ ను కలిగి ఉంది. ఇందులో 695 ఎస్ వోసి ప్రాసెసర్ ఉంటుంది. దీనిని రూ.18,999తో అమ్ముతున్నారు.

వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ అనే మొబైల్ పై వాటి కంటే ఎక్కువే ధర. కానీ అద్భుతమైన ఫీచర్లు దీని సొంతం. 120 Hz రిప్రెష్ రేట్ తో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్ డీ ప్లస్ ఎల్ సీడీ డిస్ ప్లే ను కలిగి ఉంది. ఈ మోడల్ మాక్రో లెన్స్ 2 ఎంపీని కలిగి ుంది. 5000 ఎంహెచ్ బ్యాటరీ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ను కలిగిన ఈ మొబైల్ ను రూ.19,999కే విక్రయిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Oktelugu Epaper
Exit mobile version