Homeక్రీడలుBumrah Ruined Career : టీమ్ ఇండియా కంటే ఐపీఎల్ కి ఎక్కువ ప్రాధాన్యం.. నాశనమైన...

Bumrah Ruined Career : టీమ్ ఇండియా కంటే ఐపీఎల్ కి ఎక్కువ ప్రాధాన్యం.. నాశనమైన బుమ్రా కెరీర్..!

Bumrah Ruined Career : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 వ ఎడిషన్ ఇప్పటికే ప్రారంభమైంది. టీమిండియాలో కీలక బౌలర్ గా ఎదిగిన బుమ్రా ఐపీఎల్ లో ఆడడం లేదు. అతను చాలా కాలంగా టీమిండియాలో కూడా లేడు. ఏడాది క్రితం భారత జట్టులో హీరోగా ఉన్న బుమ్రా.. ఇప్పుడు సోదిలో కూడా లేకుండా పోయాడు. ఒక ఆటగాడు డబ్బుకు ఎక్కువగా ఆశ పడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో బుమ్రా చక్కటి ఉదాహరణగా నిలుస్తాడని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

టీమిండియా బౌలింగ్ విభాగానికి సారధి..

రెండేళ్ల కిందటి వరకు జస్ప్రీత్ బుమ్రా టీమిండియా కు కొండంత బలం. భారత బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపించిన సారధి. టీమిండియాలో స్టార్ ప్లేయర్ కూడా. మాజీ పేసర్ జహీర్ ఖాన్ తర్వాత భారత జట్టుకు దొరికిన పేస్ కింగ్ గా పేరు పొందాడు. బూమ్ బూమ్ బూమ్రాగా వికెట్లను గాల్లో ఎగరేసిన బుమ్రా.. టెస్టులు, వన్డేలు, టి20లు.. ఇలా ఫార్మాట్ ఏదైనా టీమిండియాకు ప్రధాన బౌలర్ గా ఉన్నాడు. అది తక్కువ కాలంలో బీసీసీఐ యాన్యువల్ కాంట్రాక్ట్ లో ఏ, ఏ ప్లస్ గ్రేడ్లు అందుకున్నాడు. బుమ్రా దీన్లో ఉంటే తక్కువ స్కోరు చేసిన గెలవచ్చు అనే కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. కానీ అదే గ్రామంలో తనని తాను సరిగా కాపాడుకోలేక కేవలం పైసల కోసం ఎక్కువగా ఆశపడి ఇప్పుడు జట్టులో లేకుండా పోయాడు. టీమిండియా బౌలింగ్ ఎటాక్ హీరోగా ఉన్న బుమ్రా.. ఇప్పుడు జీరో గా మారిపోయాడు.

ఏడాది కాలంగా క్రికెట్ కు దూరం..

గత ఏడాది సెప్టెంబర్లో బుమ్రా టీమిండియా తరఫున చివరి మ్యాచ్ ఆడాడు. అంతకంటే ముందు జరిగిన ఆసియా కప్ 2022లో బుమ్రా ఆడలేదు. గాయం నుంచి కోలుకున్న బుమ్రా వెంటనే ఆస్ట్రేలియా తో జరిగిన టి20 సిరీస్ లో ఆడాడు. కానీ మూడో మ్యాచ్ మధ్యలోనే గాయపడ్డాడు. ఆ తర్వాత నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఎంతో ప్రతిష్టాత్మకమైన టి20 వరల్డ్ కప్ 2022 కు దూరం అయ్యాడు. ఆ తరువాత పలు చిన్న చిన్న సీరీస్ లతో పాటు ఆస్ట్రేలియాలతో జరిగిన ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సైతం బుమ్రా దూరం గానే ఉండిపోవాల్సి వచ్చింది. అదే ఆస్ట్రేలియా తో ఐపీఎల్ తర్వాత జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023లోనూ బుమ్రా ఆడే అవకాశం లేదు. దీంతో సుమారుగా ఏడాది కాలం నుంచి క్రికెట్ కు దూరమైన పరిస్థితి ఏర్పడింది.

బుమ్రా పై వెల్లువెత్తిన తీవ్ర విమర్శలు..

టీమిండియా ఆడిన చాలా మ్యాచులకు గాయంతో దూరమైన బుమ్రా.. గాయం నుంచి కోలుకొని ఐపిఎల్ లో ఆడబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. జాతీయ జట్టుకు ఆడమంటే గాయం అంటూ చెప్పే బుమ్రా.. ఐపీఎల్ కు మాత్రం రెడీ అయిపోతున్నాడు అంటూ క్రికెట్ అభిమానులు విరుచుకుపడ్డారు. కానీ న్యూజిలాండ్ వెళ్లి వెన్నెముకకు సర్జరీ చేయించుకున్న బుమ్రా ఐపీఎల్ కు దూరం అయ్యాడు.. అయితే తనపై వస్తున్న విమర్శల నుంచి తప్పించుకోవడానికి ఈసారి బుమ్రా ఐపీఎల్ కు దూరంగా ఉంటున్నాడని కూడా విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా బుమ్రా లాంటి బౌలర్ టీమిండియా కు దూరం కావడం జట్టుకు పెద్ద దెబ్బే. అయితే ఆ లోటును షమీ, సిరాజ్ లు దాదాపు కనిపించకుండా చేశారు. ఒక్క టి20 వరల్డ్ కప్ లో మినహాయిస్తే దాదాపు ఎక్కడా కూడా బుమ్రా లేని లోటు కనిపించలేదు.

మెరుగ్గా కనిపిస్తున్న భారత బౌలింగ్ దళం..

బుమ్రా లేకపోయినప్పటికీ అర్షదీప్ సింగ్, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ లతో కూడిన భారత ఫేస్ దళం మరింత మెరుగు అయింది. ఈ క్రమంలోనే బుమ్రా అవసరం దాదాపు జట్టుకు లేకుండా పోయింది. కొన్ని నెలల క్రితం టీమ్ ఇండియాకు పెద్దదిక్కుగా ఉన్న బుమ్రా ఇప్పుడు సోదిలోనే లేకుండా పోయాడు. అయితే ఇదంతా అతని స్వయంకృతాపరాధమే అని అంటున్నారు క్రీడా విశ్లేషకులు. కేవలం పైసలకు కక్కుర్తి పడి ఐపీఎల్లో విరామం లేకుండా ఎడాపెడా మ్యాచ్ లు ఆడడంతోనే బుమ్రాకు ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు. వాస్తవానికి ఫాస్ట్ బౌలర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని, గాయాల బారిన పడకుండా తమను తామే రక్షించుకుంటూ ఉండాలని, శరీరానికి రావాల్సినంత విశ్రాంతి ఇస్తేనే అది సాధ్యమవుతుందని క్రికెట్ నిపుణులు చెబుతుంటారు. కానీ బుమ్రా ఐపీఎల్లో డబ్బులకు ఎక్కువ ఆశపడి శరీరానికి భరించలేని శ్రమను ఇచ్చాడని, అందుకే ఇప్పుడు చాలా కెరీర్ ను నాశనం చేసుకున్నాడని అంటున్నారు. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెతుకుతున్నాయి. దేశానికి ప్రాతినిధ్యం వహించడం కంటే లీగ్ లు ఆడడానికి ఎక్కువ ప్రాధాన్యత నివ్వడం వల్లే ఇలా జరిగిందని పలువురు చెబుతున్నారు.

Exit mobile version