Homeఎడ్యుకేషన్Delhi Recruitment 2022: బీటెక్, ఎంఎస్సీ అర్హతతో ప్రాజెక్ట్ స్టాఫ్‌ ఉద్యోగ...

Delhi Recruitment 2022: బీటెక్, ఎంఎస్సీ అర్హతతో ప్రాజెక్ట్ స్టాఫ్‌ ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.50 వేల జీతంతో?

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఢిల్లీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం 8 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

మొత్తం 8 ఉద్యోగ ఖాళీలలో ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ 1, ప్రాజెక్ట్‌ అటెండెంట్‌ 1, జూనియర్‌ ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ 1, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ 1, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ ఉద్యోగ ఖాళీలు 4 ఉన్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 19,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు వేతనం లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. బీటెక్‌/ఎమ్మెస్సీ/ఎంసీఏ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు టెక్నికల్ నాలెడ్జ్ కూడా తప్పనిసరిగా ఉండాలి. ఆన్ లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఈమెయిల్‌ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

5g.bhartischool@gmail.com మెయిల్ కు ఈమెయిల్ చేయడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular