spot_img
Homeపండుగ వైభవంDevotional Tips: ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడాది పాటు పూజలు చేయకూడదా.... అసలు వాస్తవం ఏమిటి?

Devotional Tips: ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడాది పాటు పూజలు చేయకూడదా…. అసలు వాస్తవం ఏమిటి?

Devotional Tips: సాధారణంగా మన ఇంట్లో ఎవరైనా వ్యక్తులు చనిపోతే ఆ ఇంటిలో ఏడాదిపాటు పూజలు చేయ కూడదనే నియమాన్ని పాటిస్తున్నారు.ఇక మన ఇంట్లో ఎవరైనా పెద్దవారు చనిపోయిన వెంటనే ఇంటికి పెద్దవారు చనిపోయారు కనుక ఏడాదిపాటు ఏ విధమైనటువంటి శుభకార్యాలు చేసిన పూజ కార్యక్రమాలు చేసిన ఎంతో అరిష్టమని భావిస్తూ దేవుడి గదిలో ఉన్న దేవుడు చిత్రపటాలను ఒక శుభ్రమైన వస్త్రంలో చుట్టి దాచేస్తారు. అయితే శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోతే సంవత్సరం పాటు పూజలు చేయకూడదా? ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఈ విషయంలో శాస్త్రం ఏం చెబుతోంది అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం….

శాస్త్రం ప్రకారం కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఏడాది పాటు పూజలు చేయ కూడదనే నియమం ఏ శాస్త్రంలో కూడా లేదు. ఇవన్నీ కేవలం మన అపోహలు మాత్రమేనని శాస్త్రం చెబుతోంది. ఒక ఇంట్లో ఎవరైనా చనిపోతే 11 రోజుల పాటు ఎలాంటి పూజా కార్యక్రమాలను నిర్వహించరు.11 రోజులు పూర్తి అయిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకొని 12వ రోజు నుంచి ఎదావిధిగా మన పూజా కార్యక్రమాలను ప్రారంభించాలి అనే నియమం మాత్రమే శాస్త్రంలో ఉంది.

ఇకపోతే పన్నెండు రోజుల తర్వాత ఎదవిదిగా మనం చేసే పూజా కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా ఆలయాలకు వెళ్లి దేవుళ్లను దర్శించుకోవచ్చు. అయితే ఏ విధమైనటువంటి కొత్త పూజా కార్యక్రమాలు అనగా హోమాలు, అభిషేకాలు వంటి కార్యక్రమాలను చేయించకూడదు. అంతే కానీ ఈ ఏడాది కాలం పాటు పూజాసామాగ్రిని దాచిపెట్టి ఉండటం వల్ల ఆ ఇంటికి పరమ దరిద్రం కలుగుతుంది. ఎక్కడైతే నిత్యదీపారాధన ఉంటుందో అక్కడ సకల దేవతలు కొలువై ఉండి ఎలాంటి కష్టాలు లేకుండా ఆ కుటుంబాన్ని కాపాడుతారు. అందుకే ప్రతి రోజు దీపారాధన చేయడం ఎంతో ముఖ్యం. ఇలా చేయడం వల్ల ఏ విధమైనటువంటి అరిష్టం కూడా జరగదు కనుక ఇంట్లో ఎవరైనా చనిపోతే 11 వ రోజు నుంచి దీపారాధన విధిగా చేయడమే నియమం అని శాస్త్రం చెబుతోంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...
Oktelugu Epaper
Exit mobile version