ఆఫ్ఘనిస్థాన్ లో అమెరికా బలగాల ఉపసంహరణ ముగిసింది. బలగాల ఉపసంహరణను పెంటగాన్ ధ్రువీకరించింది. ఈ నెల 31వ తేదీలోగా బలగాల ఉపసంహరణ పూర్తవుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా సేనలు ఆఫ్గనిస్థాన్ నుంచి వెళ్లిపోయాయి. ఆఫ్ఘన్ లో 20 ఏండ్ల పాటు అమెరికా సేనలు తాలిబన్లపై పోరాడాయి. కాబూల్ నుంచి అర్ధరాత్రి బయల్దేరిన అమెరికా చివరి విమానంలో అమెరికా కమాండర్, రాయబారి ఉన్నారు. అమెరికా చివరి విమానం వెళ్లిన తర్వాత తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపి సంబురాలు చేసుకున్నారు.