కరోనాతో వరల్డ్ అండర్ డాన్ చోటా రాజన్ మరణించాడు. ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం చోటా రాజన్ ప్రాణాలు కోల్పోయాడు. దేశ రాజధాని ఢిల్లీలోని తీహర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఒకప్పటి అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ కు ఏప్రిల్ 24 వ తేదీన వైరస్ సోకిన విషయం విదితమే. అయితే రాజన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆయనను జైలు నుంచి ఢిల్లీ ఎయిమ్స్ కు ఏప్రిల్ 27 న తరలించారు. సాయధ పోలీసుల పర్యవేక్షణలో చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో ఎయిమ్స్ కు తరలించారు. అక్కడ చిక్సిత పొందుతూ మరణించాడు.