హుస్సేన్ సాగర్ లో గణేశ్ నిమజ్జనం అంశంపై రేపు విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది. హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయవద్దన్న హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు వస్తుందని అధికారులు ఆశిస్తున్నారు. ఒకవేళ రేపు తీర్పు అనుకూలంగా లేకపోతే.. నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.