
పారాలింపిక్స్ లో భారత్ కు ఇవాళ పతకాలు పంట పండింది. సోమవారం ఒకే రోజు నాలుగు పతకాలు సాధించింది. ఇప్పటికే షూటింగ్ లో బంగారు పతకం సాధించిన భారత్.. మరో మూడు మెడల్స్ ను తన ఖాతాలో వేసుకుంది. డిస్కస్ త్రోలో రజతం.. జావెలిన్ త్రోలో రజతం, కాంస్య పతకాలు లభించాయి. డిస్క్ త్రో ఎఫ్ 56 విభాగంలో యోగేశ్ కుతునియా రజత పతకం గెలుపొందాడు. ఇక జావెలిన్ త్రోలో దేవేంద్ర ఝజారియాకు రజతం లభించడగా, సుందర్ సింగ్ కు కాంస్యం గెలుపొందాడు.