Trinamool Congress crisis : రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు.. ఊహించలేరు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 200 కు పైగా బీజేపీకి సీట్లు వస్తాయని ఎవరూ ఊహించలేదు. మెజార్టీకి దగ్గరగా వస్తారని అనుకున్నారు కానీ ఇంత స్థాయిలో గెలుస్తుందని అనుకోలేదు.
అధికారం కోల్పోగానే తృణమూల్ కాంగ్రెస్ చీలిపోయి.. పార్టీ మమత నుంచి చేజారి ఇంతలా నీరుగారి పోయి పటాపంచలు అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఓటమి సహజం కానీ ఇలా దారుణంగా విచ్ఛిన్నం కావడం అనేది అసహజం..
తమిళనాడులో డీఎంకే ఓడినా ఇలా విచ్చిన్నం కాలేదు. కేరళలో పినరయి విజయ్ సీపీఎం ఓడినా ఇలా విచ్చిన్నం కాలేదు. వరుసగా మూడు దఫాలు గెలిచిన టీఎంసీ ఒక్కసారి ఓటమి చెందేసరికి.. అసలు ఎవరూ ఊహించనంత స్థాయిలో పతనమైంది. 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు గెలిస్తే 64 మంది మమత బెనర్జీపై తిరుగుబాటు ఎగురవేశారు. ఇక లోక్ సభలో టీఎంసీ ఎంపీల్లో 28లో 20 మంది తిరుగుబాటు చేశారు. రాజ్యసభలో ముగ్గురు రాజీనామా చేశారు. అధికారం పోగానే ఈ స్థాయిలో పతనమైన నాయకురాలు, పార్టీ మరొకరు లేరు. నిన్నటిదాకా మకుటం లేని మహారాణి.. నేడు అంటరాని , అప్రతిష్ట నాయకురాలుగా మారారు.
తృణమూల్ చీలిక ఢిల్లీలో ఆంధ్ర ప్రయోజనాల్ని దెబ్బతీస్తుందా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

