పశ్చిమగోదావరి జిల్లా దుగ్గిరాలకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ న్యాయాన్ని రక్షించాల్సిన పోలీసులే అన్యాయం చేస్తారా అంటూ ప్రశ్నించారు. రక్షించాల్సిన పోలీసులే భక్తిస్తున్నారు అంటూ నిప్పులు చెరిగారు. తనకు పోలీసులతో ప్రమాదం పొంచి ఉందని ఆయన అన్నారు. దెందులూరు నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉంటే మూడు మండలాల ఎస్సైలు తన మీద కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.