మహారాష్ట్రలోని చెంబూరు, విఖ్రోలిలో గోడలు కూలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 23కు పెరిగింది. చెంబూరులో జరిగిన ఘటనలో 17 మంది మృతి చెందగా విఖ్రోలిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ఆంగ్లపత్రిక ఇండియాటూడే పేర్కొంది. ఈ ఘటనల్లో మృతులకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారికి రూ. 2లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారాన్ని ప్రకటించారు.