కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ హుజూరాబాద్ ఒక్కటే కాదు అంతటా ఇలాంటి పరిస్థితి ఉందని తెలిపారు. చిల్లర రాజకీయాలను ప్రజలు సపోర్టు చేయరన్నారు. ప్రజల్లో బలమున్నవారు ఇలా చెయ్యరని చెప్పారు. ఎస్సీల జనాభా 16-17 శాతం ఉంటుందని కానీ రాష్ట్రం ప్రభుత్వంలో మాల, మాదిగలకు ఒక్కరికి మాత్రమే అవకాశం ఇచ్చారన్నారు.