స్వ‌చ్ఛ భారత్‌లో దేశంలోనే ప్రథమ స్థానం తెలంగాణ

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ్ భారత్ ర్యాకులలో తెలంగాణ రాష్టానికి మొదటి స్థానము లభించింది. గాంధీ జ‌యంతి, స్వ‌చ్ఛ భార‌త్ దివ‌స్ సంద‌ర్భంగా ఈ అవార్డుని తెలంగాణ రాష్ట్రం త‌ర‌పున రాష్ట్ర‌ పంచాయ‌తీరాజ్, ‌గ్రామీణాభివృద్ధి, పారిశుద్ధ్య కార్యదర్శి సందీప్ కుమార్ గారు కేంద్ర జ‌ల్ శ‌క్తి మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ గారి నుండి శుక్ర‌వారం వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో అవార్డును అంద‌చేశారు. కార్య‌క్ర‌మంలో క‌మిష‌న‌ర్ ఎం.ర‌ఘునంద‌న్ రావు, స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్ట‌ర్ ఎస్.దిలీప్ కుమార్, రాష్ట్ర […]

Written By: NARESH, Updated On : October 2, 2020 9:16 pm
Follow us on

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ్ భారత్ ర్యాకులలో తెలంగాణ రాష్టానికి మొదటి స్థానము లభించింది. గాంధీ జ‌యంతి, స్వ‌చ్ఛ భార‌త్ దివ‌స్ సంద‌ర్భంగా ఈ అవార్డుని తెలంగాణ రాష్ట్రం త‌ర‌పున రాష్ట్ర‌ పంచాయ‌తీరాజ్, ‌గ్రామీణాభివృద్ధి, పారిశుద్ధ్య కార్యదర్శి సందీప్ కుమార్ గారు కేంద్ర జ‌ల్ శ‌క్తి మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ గారి నుండి శుక్ర‌వారం వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో అవార్డును అంద‌చేశారు. కార్య‌క్ర‌మంలో క‌మిష‌న‌ర్ ఎం.ర‌ఘునంద‌న్ రావు, స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్ట‌ర్ ఎస్.దిలీప్ కుమార్, రాష్ట్ర స్వచ్ఛ భారత్ మిషన్ బృందం స‌భ్యులు పాల్గొన్నారు.