
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాక మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాంద్రి ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ మొదటి విడత ఈనెల 30 న ప్రారంభమవుతుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు ఈనెల 30 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆన్ లైన్ లో స్టాట్ బుక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. సెప్టెంబరు 4 నుంచి 11 వరకు ధ్రువపత్రాలను పరిశీలిస్తామని, సెప్టెంబర్ 4 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని వెల్లడించారు.