క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానెల్ అధినేత తీన్మార్ మల్లన్నను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీకి తసుకున్నారు. గతంలో సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ లో తీన్మార్ మల్లన్నపై కేసు నమోదైంది. ఈ కేసులో మల్లన్నను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరగా న్యాయస్థానం ఒకరోజు కస్టడీకి అనుమతించింది. ఇవాళ మల్లన్నను సైబర్ క్రైమ్ పోలీసులు విచారించనున్నారు. ప్రస్తుతం తీన్మార్ మల్లన్న చంచల్ గూడ జైలులో ఉన్నారు.