ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయుడు మృతి

ఎన్నికల విధులకు హాజరైన ఓ ఉపాధ్యాయుడు గుండెపోటుతో మరణించారు. మెతుకు రమేష్ బాబు అనే ఉపాధ్యాయుడు జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని కొండాపూర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. అయితే ఎన్నికల విధుల్లో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ 57 వ డివిజన్ లో ని సమ్మయ్య నగర్ లో పోలింగ్ బూత్ కేటాయించారు. శుక్రవారం ఉదయం పోలింగ్ విధులు నిర్వహిస్తుండగా గుండెపోటు రావడంతో రమేష్ బాబు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దవాఖానకు తరలించేలోపే ఆయన చనిపోయారు.

Written By: Suresh, Updated On : April 30, 2021 11:51 am
Follow us on

ఎన్నికల విధులకు హాజరైన ఓ ఉపాధ్యాయుడు గుండెపోటుతో మరణించారు. మెతుకు రమేష్ బాబు అనే ఉపాధ్యాయుడు జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని కొండాపూర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. అయితే ఎన్నికల విధుల్లో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ 57 వ డివిజన్ లో ని సమ్మయ్య నగర్ లో పోలింగ్ బూత్ కేటాయించారు. శుక్రవారం ఉదయం పోలింగ్ విధులు నిర్వహిస్తుండగా గుండెపోటు రావడంతో రమేష్ బాబు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దవాఖానకు తరలించేలోపే ఆయన చనిపోయారు.