Homeఆంధ్రప్రదేశ్‌Tammineni Sitaram : తమ్మినేని సీతారాం నకిలీ పత్రాల ముఠాతో జట్టు.. భూకబ్జా కేసులో వెలుగులోకి...

Tammineni Sitaram : తమ్మినేని సీతారాం నకిలీ పత్రాల ముఠాతో జట్టు.. భూకబ్జా కేసులో వెలుగులోకి దారుణ నిజాలు..

వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శాసనసభాపతిగా ఉన్న తమ్మినేని సీతారాం భూకబ్జాలకు పాల్పడ్డారు. చాపురం పంచాయతీ లోని బలగ గ్రామ పరిధిలో కట్ట కనక లింగేశ్వర రావు కొనుగోలు చేసిన భూమిని సీతారాం ఆక్రమించారు. ఆ తర్వాత రకరకాల అక్రమాలకు పాల్పడ్డారు. ఆ ప్లాట్లను తన కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. ఇంతటితోనే ఆగిపోలేదు భూమిని కుమారుడి పేరు మీద చేయించడానికి శ్రీకాకుళం మున్సిపాలిటీలో కనక లింగేశ్వర రావు చనిపోయినట్టు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని రూపొందించారు. మొత్తంగా 922 చదరపు గజాల స్థలాన్ని తన కుమారుడు పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

ఈ వ్యవహారంలో ఏపీ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో సీతారాం భూకబ్జా కథలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులుగా రజిని, ఆమె అల్లుడు సలిపల్లి లక్ష్మణరావు.. సతీష్ కుమార్.. త్రినాధ్.. తమ్మినేని సీతారాం.. ఆయన భార్య వాణి ఉన్నారు. వీరు సహకరించడం వల్లే కూన పెద్దిరాజు అనే డాక్యుమెంట్ రైటర్ నకిలీ పత్రాలు సృష్టించారు. తమ్మినేని సీతారాం కు చెందిన డిగ్రీ కాలేజీలో పనిచేసే సిబ్బంది తో దారుణమైన పనులు చేయించారు. రిజిస్ట్రేషన్ సమయంలో వారితో సాక్షుల సంతకాలు పెట్టించారు. భూమికోసం తమ్మినేని ఇంతటి కుట్రలకు పాల్పడ్డారు. భూమి విలువ కోట్లలో ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

ఇక ఈ కేసులో నకిలీ పత్రాలు ముఠాతో తమ్మినేని కుటుంబం సంబంధాలు కొనసాగించింది.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న త్రినాధ్ మాజీ హోంగార్డు. ఇతడి మీద మూడు కేసులున్నాయి. సతీష్ కుమార్ కూడా కేసులు ఎదుర్కొంటున్నాడు. లక్ష్మణరావు.. రజిని.. మిగతావారు ఒక ముఠాగా ఏర్పడ్డారు. భూములను కబ్జా చేస్తున్నారు.. ఐదు సంవత్సరాల క్రితమే రజిని ద్వారా ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కూడా చేయించారు.. ఒడిశా రాష్ట్రంలోని జయపుర ప్రాంతంలో రజనీ నివాసం ఉంటున్నది. ఇలాంటి అడ్డగోలు భూ వ్యవహారాల కోసమే బొబ్బిలి వచ్చింది. తన అల్లుడి చిరునామా ద్వారా మరో ఆధార్ తీసుకుంది. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఇక ఈ వ్యవహారంలో ఆమెకు భారీగానే నగదు ముట్టినట్టు తెలుస్తోంది. ఈకేసును పోలీసులు లోతుగా పరిశీలిస్తున్న నేపథ్యంలో ఇంకా సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...

Tollywood Directors: బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేని తెలుగు దర్శకులు వీళ్లే…

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు కొందరు తెలుగు హీరోలు అవకాశం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా వంశీ పైడిపల్లి తెలుగు స్టార్...
Oktelugu Epaper
Exit mobile version